Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో 272కు చేరిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నేడు 272కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. శనివారం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రెస్ నోట్..

తెలంగాణలో 272కు చేరిన కరోనా కేసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 05, 2020 | 8:22 AM

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నేడు 272కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. శనివారం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అలాగే తెలంగాణలో కరోనా వైరస్ కమ్యునిటీ స్ప్రెడ్ జరగలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనకు వెళ్లినవారిని గుర్తుపడుతున్నామని తెలిపారు. అలాగే ఎవరికైనా అనుమానాలుంటే స్వచ్ఛందంగా వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కరోనా కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చినవారు లేదా వారితో కలిసినవారు మాత్రమేనని తెలిపారు.

ప్రెస్‌నోట్‌లోని అంశాలు:

1. మర్కజ్ నుంచి 1090 మంది తెలంగాణకి వచ్చారు. వారందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం 2. అన్ని క్వారంటైన్ సెంటర్లలో వైద్యులను నియమించాం. నర్సులు, పారా మెడికల్ సిబ్బంది అందరూ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారు 3. అలాగే అన్ని సెంటర్స్‌లో ఎన్-95 మాస్కులు, పిపిఈ కిట్స్ సరిపోయేయన్ని అందుబాటులో ఉంచామన్నారు 4. వైద్యులు, సిబ్బందిపై ఎవరు దాడి చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు 5. సీఎం సూచనతో ప్రతీ రోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సీఎస్, వైద్య శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామన్నారు 6. అలాగే గచ్చిబౌలిలో 15 వందల పడకల ఆసుపత్రి మరో రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుంది 7. ఆరు ల్యాబ్‌లు 24 గంటలూ పని చేస్తున్నాయి

ఇవి కూడా చదవండి:

డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పిన మెగాస్టార్

నల్లా నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని తేల్చిచెప్పిన WHO

లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తేస్తారో.. చెప్పిన మోదీ

కరోనాపై మోదీ మరో సందేశం.. ఏప్రిల్ 5న అందరూ జాగరణ చేయాలి

వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..

విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం