Mandya: హృదయ విదారక ఘటన.. కోవిడ్ రిపోర్టు లేదని గర్భిణికి వైద్యం నిరాకరణ.. ఆ తర్వాత ఏమైందంటే?

Woman gives birth in front of hospital in Mandya : కరోనా కాలంలో ఎన్నో హృదయవిదారక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మహమ్మారి వల్ల సరైన వైద్యం అందక ప్రజలు

Mandya: హృదయ విదారక ఘటన.. కోవిడ్ రిపోర్టు లేదని గర్భిణికి వైద్యం నిరాకరణ.. ఆ తర్వాత ఏమైందంటే?
Heart Breaking Incident In Mandya
Follow us

|

Updated on: May 27, 2021 | 8:27 AM

Woman gives birth in front of hospital in Mandya : కరోనా కాలంలో ఎన్నో హృదయవిదారక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మహమ్మారి వల్ల సరైన వైద్యం అందక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని మండ్యా పట్టణంలో తీవ్రంగా కలచివేసే హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్యం అందక ఆస్పత్రి ఎదుటే ప్రసవించింది. పుట్టగానే నవజాత శిశువు మరణించడంతో ఆ తల్లి విలవిలలాడింది. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ కలచివేసింది. మంగళవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న సోనూను ఆమె కుటుంబసభ్యులు మండ్యాలోని ఎంఐఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోవిడ్‌-19 రిపోర్టు లేదన్న కారణంతో వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు.

దీంతో పురిటినొప్పులతో బాధపడుతున్న సోనూను కాపాడాలంటూ.. కుటుంబ సభ్యులు ఎంతగా ప్రాధేయపడినా పురుడు పోసేందుకు డాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో నొప్పులు తాళలేక సోనూ అక్కడే ప్రసవించింది. అయితే.. ప్రసవించిన కొద్దిసేపటికి బిడ్డను కోల్పోయింది. పుట్టిన కాసేపటికే శిశువు చనిపోవడంతో ఆ మహిళ తీవ్రంగా రోధించడం చూపరులను కంటతడి పెట్టించింది. కుటుంబం మొత్తం కన్నీంటిపర్యంతమైంది. ఎంత ప్రాథేయపడినప్పటికీ.. ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోలేదని.. దీంతోనే సోనూ బిడ్డ మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు. Also Read:

యూపీలో అమానుషం.. మాస్కు ధరించలేదని.. యువకుడికి మేకులు దించిన పోలీసులు

Cyclone Yaas: యాస్ తుపాను బీభత్సకాండ.. సునామీలా విరుచుకుపడ్డ ప్రక‌ృతి ప్రళయం.. కోటిమందిపై ప్రభావం..!