AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోనులో చిరుతను పెట్రోల్‌ పోసి నిప్పంటించిన గ్రామస్తులు..150 మందిపై కేసు

అటవీ శాఖ అధికారులు పట్టుకున్న ఏడేళ్ల మగ చిరుత సజీవ దహనమైంది. పౌరీ గర్వాల్ జిల్లాలోని ఓ గ్రామంలో అటవీశాఖ అధికారుల ముందే గ్రామస్తులు చిరుతను తగులబెట్టిన ఘటన సంచలనం రేపుతోంది.

బోనులో చిరుతను పెట్రోల్‌ పోసి నిప్పంటించిన గ్రామస్తులు..150 మందిపై కేసు
Leopard
Jyothi Gadda
|

Updated on: May 27, 2022 | 6:36 PM

Share

అటవీ శాఖ అధికారులు పట్టుకున్న ఏడేళ్ల మగ చిరుత సజీవ దహనమైంది. పౌరీ గర్వాల్ జిల్లాలోని ఓ గ్రామంలో అటవీశాఖ అధికారుల ముందే గ్రామస్తులు చిరుతను తగులబెట్టిన ఘటన సంచలనం రేపుతోంది. ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు చిరుత ఉన్న బోనుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనపై పోలీసులు 150మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. అధికారులు తెలిపిన సమాచారం మేరకు పూర్తి వివరాల్లోకి వెళితే…

పౌరి గర్వాల్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇటీవల ఒక చిరుత పులి మహిళపై దాడి చేయడంతో, ఆమె మరణిచింది. దాంతో ఆగ్రహించిన గ్రామస్తులు బోనులో పడ్డ చిరుతను కాల్చివేశారు. అయితే, మహిళపై దాడి చేసింది చిరుతపులి అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. జరిగిన ఘటనపై అటవీ శాఖ అధికారులు, పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. జరిగిన ఘటనపై పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ మేరకు జిల్లా అటవీ అధికారి ముఖేష్ శర్మ మాట్లాడుతూ, మే 15న జిల్లాలోని సప్లోడి గ్రామంలో 47 ఏళ్ల సుష్మా దేవి అనే మహిళ చిరుత దాడి చేసిన ఆనవాళ్లతో హత్యకు గురైందని తెలిపారు. ఈ క్రమంలోనే గ్రామంలో పలుచోట్ల బోనులు ఏర్పాటు చేశారు. కాగా, మంగళవారం ఉదయం 5.20 గంటల ప్రాంతంలో బోనులో చిరుతపులి కనిపించింది. చిరుత చిక్కందని గ్రామస్తుల నుంచి సమాచారంతో అటవీ అధికారులు గ్రామానికి చేరకుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి, చిరుతను వేరే చోటుకు తరలిస్తామన్నారు.

అయితే, తమ గ్రామంలోని మహిళ మరణానికి కారణమైందన్న ఆగ్రహంతో కొందరు గ్రామస్తులు రెచ్చిపోయారు.. చిరుత ఉన్న బోను పై పెట్రోలు చల్లారు. బోనులో గడ్డి వేసి తగులబెట్టారు. దీంతో చిరుతపులి బోనులోనే సజీవ దహనమైంది. ఫారెస్టు అధికారులు వారించినా ఫలితం లేకపోయింది. పెట్రోల్‌ దాటికి మంటలు ఎగిసిపడ్డాయి. ఘటన అనంతరం చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు అధికారులు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న గ్రామస్తులపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు చెప్పారు. మృతిచెందిన చిరుత ఏడేళ్ల మగ చిరుతపులిగా అధికారులు గుర్తించారు. అదే చిరుత మహిళను చంపిందా లేదా అనేది నిర్ధారించలేకపోయామన్నారు.. గ్రామస్థులు చిరుతపై ఎందుకు దాడి చేశారనే దానిపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, 2011లో జిల్లాలోని ధామ్‌ధర్ గ్రామంలో ఆగ్రహించిన ప్రజలు అటవీ అధికారులు, పోలీసుల ముందు చిరుతపులిని సజీవ దహనం చేశారు. ఆ తర్వాత జంతువును చంపినందుకు నమోదైన కేసును ఉపసంహరించుకున్నారు. అనేక సందర్భాల్లో, చిరుతపులులు నరమాంస భక్షకులుగా మారినప్పుడు వాటిని చంపడానికి అటవీ శాఖ వేటగాళ్లను పిలుస్తుంది. 2020లో, డిపార్ట్‌మెంట్‌చే నిమగ్నమైన వేటగాళ్ళు అల్మోరా జిల్లాలో ఇద్దరు వ్యక్తులను చంపిన చిరుతపులిని కాల్చి చంపారు. ఈ ఏడాది ప్రారంభంలో, తెహ్రీలో బాలుడిని చంపిన చిరుతపులిని డిపార్ట్‌మెంట్ నియమించిన వేటగాళ్లు కాల్చి చంపారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండిః

Follow Us
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!