ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన నలుగురు పిల్లల తల్లి.. అనంతరం రోడ్డు పక్కన నీళ్ల గుంతలో..

మద్యం మత్తులో ఉన్న భర్తను ఓ భార్య ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేయించింది. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్‌లో ఎక్కించి రోడ్డుపక్కన ఉన్న గొయ్యిలో పడేసింది. ఎవరికీ తెలియదులే అనుకుంది. కానీ నిఘా నేత్రాలు వారి పాపాన్ని పోలీసులకు పట్టించాయి. ఈ షాకింగ్‌ ఘటన..

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన నలుగురు పిల్లల తల్లి.. అనంతరం రోడ్డు పక్కన నీళ్ల గుంతలో..
Wife Killed Husband
Follow us

|

Updated on: Sep 10, 2023 | 7:20 PM

లక్నో, సెప్టెంబర్‌ 10: మద్యం మత్తులో ఉన్న భర్తను ఓ భార్య ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేయించింది. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్‌లో ఎక్కించి రోడ్డుపక్కన ఉన్న గొయ్యిలో పడేసింది. ఎవరికీ తెలియదులే అనుకుంది. కానీ నిఘా నేత్రాలు వారి పాపాన్ని పోలీసులకు పట్టించాయి. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాకు చెందిన కమతా కబీర్ (35), అంజు దంపతులు. వీరికి నలుగు సంతానం. వీరు స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన కబీర్ నిత్యం భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలో భార్య అంజు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త వేధింపులు తాళలేక భార్య అంజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది చేసింది. ఈక్రమంలో భర్తను హతమార్చడానికి అంజు ప్రియుడితో కలిసి కుట్రపన్నింది. పథకం ప్రకారం శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న కబీర్‌ను కొట్టి చంపించింది. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న నీళ్ల గుంతలో పడేశారు. ఏమీ ఎరుగనట్లు ఇద్దరు వెళ్లిపోయారు. ఉదయం నీటితో నిండిన గోతిలో కబీర్ మృతదేహం లభ్యమైంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం మృతదేహం పడి ఉన్న తీరును బట్టి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. కదులుతున్న ట్రాక్టర్‌ నుంచి మృతదేహాన్ని రోడ్డుపక్కన ఉన్న నీళ్లతో నిండిన గుంతలోకి విసిరేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ఈ ఫుటేజీ ఆధారంగా మృతుడి భార్య అంజు, ఆమె ప్రియుడు వీరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. హమీర్‌పూర్ ఏఎస్పీ మాయారం వర్మ మాట్లాడుతూ..

ఆదివారం ఉదయం బేరిరోడ్డులో రోడ్డు పక్కన నీళ్ల గుంతలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కురారా పట్టణానికి చెందిన కమతా కబీర్‌గా గుర్తించారు. కమత ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకుని నడిపేవాడు. భర్త మృతి చెందిన సమాచారం అందుకున్న మృతుడి భార్య పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తన భర్త మద్యానికి బానిసయ్యాడని, రాత్రి మద్యం మత్తులో గొయ్యిలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులకు తెలిపింది. అంజు మాటలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఘటనా స్థలం సమీపంలోని సీసీటీవీని పరిశీలించారు. హత్య చేసి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేసినట్లు తేలింది. తన భార్యకు డ్రైవర్‌తో ఉన్న అక్రమ సంబంధం గురించి మృతుడికి తెలియడంతో ఈ దారుణానికి దాని తీసింది. భార్య తన ప్రియుడితో కలిసి ఇంట్లోనే కొట్టి చంపి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో ఎక్కించి బయటకు విసిరేసినట్లు ఎస్పీ మాయారం వర్మ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ