మొదటిరోజు రాత్రి వధువు కోరిక విన్న వరుడు షాక్.. క్షణంలో చెదిరిపోయిన కలలు..!

వధువు డిమాండ్ విన్న వరుడు షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని వరుడు కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. వధువు డిమాండ్‌ను కుటుంబసభ్యులు వ్యతిరేకించారు.

మొదటిరోజు రాత్రి వధువు కోరిక విన్న వరుడు షాక్.. క్షణంలో చెదిరిపోయిన కలలు..!
Wedding Night
Follow us

|

Updated on: Oct 19, 2024 | 12:42 PM

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి రోజు రాత్రి వరుడి ముందు ఒక వధువు భారీ కోరిక కోరింది. అది విని వరుడు షాక్ అయ్యాడు. అయితే అందుకు వరుడితో సహా అతని తరపు వారు వ్యతిరేకించడంతో, వారిని గ్యాంగ్ రేప్‌లో ఇరికిస్తానని బెదిరించింది. ఇక మరుసటి రోజు కుటుంబసభ్యులు చూసేసరికి, నగదు, నగలతో వధువు ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో లబోదిబోమంటూ వరుడు పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. పెళ్లిరోజు రాత్రి కానుకగా వరుడి నుంచి వధువు రూ.5 లక్షలు, తన పేరుతో ఆస్తి మొత్తం రాయాలంటూ డిమాండ్ చేసింది నవ వధువు. అట్లాగైతేనే కాపురం చేస్తానంటూ తేల్చి చెప్పింది. వధువు డిమాండ్ విన్న వరుడు షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని వరుడు కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. వధువు డిమాండ్‌ను కుటుంబసభ్యులు వ్యతిరేకించడంతో, అతనితోపాటు కుటుంబసభ్యులపై సామూహిక అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించింది. ఆ తర్వాత మరుసటి రోజు నుంచి నవ వధువు కనిపించకుండాపోయింది. దీంతో వరుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులకు అందిన సమాచారం మేరకు పెళ్లయిన రెండో రోజు తెల్లవారుజామున వధువు అత్తగారి నగలు, నగదుతో పారిపోయింది. మరుసటి రోజు ఉదయం ఈ విషయం వరుడి కుటుంబీకులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంట్లో ఉంచిన బంగారు, వెండి నగలు, రూ.2 లక్షలతో వధువు పారిపోయిందని పోలీసులు తెలిపారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సదరు మహిళ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వధువు అసలు ప్రణాళికలు వెల్లడయ్యాయి. ఆమెకు ఇది మూడో పెళ్లి అని పోలీసులు చెప్పారు. ఇంతకు ముందు కూడా దొంగ పెళ్లికూతురు తన కుటుంబ సభ్యులతో కలిసి రెండు ఇళ్లను టార్గెట్ చేసి, తప్పుడు కేసులో ఇరికించి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన్నట్లు పోలీసులు వెల్లడించారు.

వరుడి మామకు ఢిల్లీలో కిరాణా దుకాణం ఉంది. అక్కడ ఓ మహిళ పని చేసేది. ఆ మహిళ చిత్తశుద్ధిని చూసిన ఆ యువకుడు ఇష్టపడ్డాడు. దీని తరువాత, ఇరు కుటుంబాల అంగీకారంతో, నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 న ఆలయంలో వివాహం జరిగింది. ఇక తొలిరోజు రాత్రి నుంచే వరుడికి చుక్కలు చూపించింది మాయలేడీ. డబ్బులు ఇవ్వకుంటే కేసుల్లో ఇరికిస్తానని బెదిరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..