AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనికి 31 ఏళ్లు.. ఆమె వయసు 61.. కట్ చేస్తే వృద్ధ దంపతుల దారుణ హత్య!

నెహ్రూనగర్‌లో నివసిస్తున్న ఎన్‌కే శ్రీవాస్తవ (75), అతని భార్య సుజాతాదేవి (61) అనే వృద్ధ దంపతులను నిందితులు దారుణంగా హత్య చేశారు. సీసీ కెమెరాల సాయంతో ఈ జంట హత్యను పోలీసులు బయటపెట్టారు.

అతనికి 31 ఏళ్లు.. ఆమె వయసు 61.. కట్ చేస్తే వృద్ధ దంపతుల దారుణ హత్య!
Bihar Police
Balaraju Goud
|

Updated on: Oct 19, 2024 | 12:10 PM

Share

బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ కుమార్ అలియాస్ చింటూని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో పోలీసులు కేసును ఛేదించారు. 61 ఏళ్ల వృద్ధురాలితో 31 ఏళ్ల అమిత్ అనైతిక సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. బుధవారం(అక్టోబర్ 16) వృద్ధురాలి భర్త వారిద్దరినీ అభ్యంతరకర స్థితిలో చూశాడు. దీంతో ఘర్షణ చోటుచేసుకుని వృద్ధ దంపతుల హత్యకు దారి తీసింది.

పాట్నాలో వృద్ధ దంపతులను హత్య చేసిన కేసులో నిందితుడు అమిత్ కుమార్ అలియాస్ చింటూ (31)ని పోలీసులు అరెస్టు చేశారు. నెహ్రూనగర్‌లో నివసిస్తున్న ఎన్‌కే శ్రీవాస్తవ (75), అతని భార్య సుజాతాదేవి (61) అనే వృద్ధ దంపతులను నిందితులు దారుణంగా హత్య చేశారు. సీసీ కెమెరాల సాయంతో ఈ జంట హత్యను పోలీసులు బయటపెట్టారు. నిందితుడి చొక్కా, బైక్ నంబర్ల ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించారు.

నిందితుడు వృద్ధురాలితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం నిందితుడు అమిత్, వృద్ధురాలిని ఆమె భర్త అభ్యంతరకర స్థితిలో కనిపించారు. అభ్యంతరకర స్థితిలో ఉన్న అతన్ని చూసి, వృద్ధ భర్త అరవడం ప్రారంభించాడు. దీంతో వృద్ధుడిపై దాడి చేసిన అమిత్, మంచంపైకి తోసేసి, అతని ముఖాన్ని దిండుతో ఉపిరాడకుండా చేశాడు. కొద్దిసేపటికే, మహిళ వంటగదిలో నుండి కత్తిని తెచ్చి, తన భర్త ఛాతీపై నాలుగు సార్లు పొడిచి చంపింది.

ఇంతలో నిందితుడు మహిళ గొంతును వెనుక నుంచి కోశాడు. ఆమె గొంతు కోసిన తర్వాత, మహిళ నేలపై పడిపోయింది. ఆ తర్వాత ఆమె తలను సుత్తితో చితకబాదాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన సమాచారం ఇస్తూ, ఇది బ్లైండ్ కేసు అని ఎస్ఎస్పీ రాజీవ్ మిశ్రా తెలిపారు. అక్రమ సంబంధంతోనే ఈ హత్య జరిగిందని నిర్ధారించామన్నారు. నిందితుడు అమిత్ తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన అనంతరం ఓ వ్యక్తి దంపతుల ఇంటి నుంచి బైక్‌పై బయటకు రావడం సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు చూశారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడి చొక్కా, బైక్ నంబర్‌ను పోలీసులు గుర్తించారు. ఈ ఆధారాలతో కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు నిందితుడు అమిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ విచారణలో కత్తులు, కర్రలు, దిండ్లు తదితర వాటిపై నిందితుల వేలిముద్రలు లభించాయి. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పాట్నా పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..