AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly: నవంబర్ 28 నుంచి యూపీ అసెంబ్లీ సమావేశాలు.. సభలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 28 నుంచి ప్రారంభం కానున్నాయి. 66 ఏళ్ల తర్వాత యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం హయాంలో కొత్త నిబంధనలతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ చివరి సెషన్‌లోనే మార్పులు అనుమతించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ కొత్త మార్పులు అమలులోకి వచ్చాయి.

UP Assembly: నవంబర్ 28 నుంచి యూపీ అసెంబ్లీ సమావేశాలు.. సభలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం
Uttar Pradesh Assembly
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 25, 2023 | 7:21 PM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 28 నుంచి ప్రారంభం కానున్నాయి. 66 ఏళ్ల తర్వాత యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం హయాంలో కొత్త నిబంధనలతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ చివరి సెషన్‌లోనే మార్పులు అనుమతించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ కొత్త మార్పులు అమలులోకి వచ్చాయి. ఇందులో భాగంగా శాసన సభలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లే నేతలపై నిషేధం విధించారు. మొబైల్ లేకుండానే అసెంబ్లీ హాల్‌లోకి ప్రవేశించాలని సూచించారు. అంతేకాకుండా సభలో జెండాలు, బ్యానర్లు, ఫ్లకార్డులు తీసుకువెళ్లకుండా నిషేధం విధించారు.

ఇదిలావుంటే, ఈ సెషన్‌లో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతకు సంబంధించి బిల్లును తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది యోగి ఆదిత్యానాథ్ సర్కార్. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం నిర్ణయించింది. సెషన్‌లో మాట్లాడేందుకు మహిళా సభ్యులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. సభ ప్రారంభమైన తొలి రోజున ప్రస్తుత, మాజీ సభ్యుల మృతికి సంతాపం తెలియజేస్తారు.

దీని తర్వాత నవంబర్ 29 నుంచి సభా కార్యక్రమాలు సజావుగా ప్రారంభమవుతాయి. ఈ రోజున, మొదటి అర్ధభాగంలో, ఆర్డినెన్స్‌లు, నోటిఫికేషన్‌లు, నియమాలు మొదలైన వాటిని శాసన సభ ముందు పెడతారు. ఇది కాకుండా పలు కీలక బిల్లులకు ఆమోదం తెలుపనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సప్లిమెంటరీ గ్రాంట్ల కోసం డిమాండ్లు మధ్యాహ్నం 12:30 తర్వాత సమర్పించడం జరుగుతుంది. అదే సమయంలో, ఇతర శాసన పనులు పూర్తవుతాయి.

శీతాకాల సమావేశాల మూడో రోజు అంటే నవంబర్ 30న 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ గ్రాంట్లపై చర్చ జరుగుతుందని, ఇందులో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది. ఈ సమయంలో ఎమ్మెల్యేల డిమాండ్లను పరిశీలించి ఓటు వేయవచ్చు. అలాగే విభజన బిల్లును తిరిగి ప్రవేశపెట్టే పని కూడా సభ అనుమతితో జరగనుంది. శీతాకాల సమావేశాల చివరి రోజైన డిసెంబర్ 1న శాసనసభ పనులు పూర్తవుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…