Anurag Thakur: క్రీడా రంగం అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కృషి.. ఎన్ఐఎస్లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్..
NIS Patiala: పాటియాలాలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్) అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కోట్లాది రూపాయలను కేటాయించిందని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. గత సంవత్సరంలో ఎన్ఐఎస్లో ప్రధాని మోదీ ప్రభుత్వం కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టిందని.. ఇవాళ 13 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు..

Union Minister Anukar Thakur: పాటియాలాలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్) అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కోట్లాది రూపాయలను కేటాయించిందని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. గత సంవత్సరంలో ఎన్ఐఎస్లో ప్రధాని మోదీ ప్రభుత్వం కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టిందని.. ఇవాళ 13 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, 36 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కొనసాగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా 24 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతి లభించిందని అనురాగ్ ఠాకూర్ వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రూ.36 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో హై-పెర్ఫార్మెన్స్ సెంటర్, సెంట్రలైజ్డ్ కిచెన్, మిల్కా సింగ్ హాస్టల్ అప్గ్రేడేషన్ ఉన్నాయని.. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.
సోమవారం ఎన్ఐఎస్ పాటియాలాలో పునర్నిర్మించిన అతిథి గృహాల ప్రారంభోత్సవానికి ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. “NIS (నేతాజీ సుభాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్) పాటియాలా కోసం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత సంవత్సరంలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టింది, నేడు, 13 కోట్ల రూపాయల విలువైన ప్రారంభోత్సవాలు జరిగాయి, రూ. 36 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, రూ. 24 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతి లభించింది’’ అని చెప్పారు.




Sharing moments from my wonderful interaction with the #AsianGames2022 bound Boxing and Kabaddi Contingent at NCoE NSNIS @SAI_Patiala today. Reviewed their preparation ahead of the Games. Witnessing their dedication & commitment firsthand was truly inspiring.
This prestigious… pic.twitter.com/aoecKAjBRZ
— Anurag Thakur (@ianuragthakur) August 28, 2023
ప్రస్తుతం కొనసాగుతున్న రూ.36 కోట్ల విలువైన ప్రాజెక్ట్లలో హై-పెర్ఫార్మెన్స్ సెంటర్, సెంట్రలైజ్డ్ కిచెన్, మిల్కా సింగ్ హాస్టల్ అప్గ్రేడేషన్, బాక్సర్ల కోసం ప్రత్యేక హాల్ ఉన్నాయి. కొత్త ఆంక్షల ప్రకారం ఆటగాళ్లకు ఆల్-వెదర్ స్విమ్మింగ్ పూల్ అందించనున్నారు. సింథటిక్ ట్రాక్ రిలే చేయడంతోపాటు.. జావెలిన్ త్రో సిమ్యులేటర్ నీరజ్ చోప్రా, కిషోర్ జెనా వంటి పెద్ద ఆటగాళ్లకు శిక్షణ కోసం భారీ సౌకర్యాన్ని అందిస్తుంది.. అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
#WATCH | Patiala: “For NIS (Netaji Subhas National Institute of Sports) Patiala, investments worth crores of rupees have been made in the last year by PM Modi’s government. Today, inaugurations worth Rs 13 crore have been done, Rs 36 crore worth of projects are going on, and we… https://t.co/X9Fas4d0vp pic.twitter.com/X3MwLL5xg0
— ANI (@ANI) August 28, 2023
ఠాకూర్ సోమవారం ప్రారంభించిన ప్రాజెక్టులపై కూడా చర్చించారు. హాస్టళ్లు, వసతి సౌకర్యాల పునరుద్ధరణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. “నేటి ప్రారంభోత్సవాలలో వెయిట్ లిఫ్టింగ్ హాల్, శిక్షణా కేంద్రం, గెస్ట్ హౌస్ పునరుద్ధరణ, 12 సెట్ల విదేశీ కోచ్ వసతి, యువత కోసం హాస్టల్ గదుల పునరుద్ధరణ ఉన్నాయి. ఇది సౌకర్యాలలో భారీ అప్గ్రేడ్. ఇది చాలా మెరుగుదలలు జరిగాయి. ఇటీవలి సంవత్సరాలలో, ఆహారం మరియు పౌష్టికాహారంతో సహా అన్ని మంచిగా అందుతున్నాయి. ఇంతకుముందు, ఇక్కడ ఆహార నాణ్యత తక్కువగా ఉందని ఫిర్యాదులు ఉండేవి, కానీ గత రెండు-నాలుగు సంవత్సరాల నుంచి అత్యున్నత స్థాయి చెఫ్లచే అత్యుత్తమ నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నందున మాకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదు, “అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ ఆసియా క్రీడలు ఆడేందుకు సిద్ధంగా ఉన్న క్రీడాకారులతో ముచ్చటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..