AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్‌కు వెళ్లకండి.. బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియాలు హెచ్చరిక!

జమ్మూకాశ్మీర్‌లోని ఉద్రిక్తత పరిస్థితులను ప్రపంచదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ మేరకు కొన్ని దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ దేశం నుంచి కశ్మీర్‌లో పర్యటించాలనుకునే యాత్రికులు అక్కడ తీవ్రమైన సమస్యను ఎదుర్కొనే అవకాశముందని.. అందుచేత అక్కడ పర్యటించొద్దంటూ బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశ ప్రభుత్వాలు వారి పౌరులను హెచ్చరించాయి. ఒకవేళ ఎవరైనా అక్కడ ఉన్నా.. వెంటనే తిరిగి వచ్చేయాలని సూచించారు. అటు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం అమర్ నాథ్ యాత్రికులను సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని సూచించిన […]

కశ్మీర్‌కు వెళ్లకండి.. బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియాలు హెచ్చరిక!
Ravi Kiran
|

Updated on: Aug 04, 2019 | 12:17 AM

Share

జమ్మూకాశ్మీర్‌లోని ఉద్రిక్తత పరిస్థితులను ప్రపంచదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ మేరకు కొన్ని దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ దేశం నుంచి కశ్మీర్‌లో పర్యటించాలనుకునే యాత్రికులు అక్కడ తీవ్రమైన సమస్యను ఎదుర్కొనే అవకాశముందని.. అందుచేత అక్కడ పర్యటించొద్దంటూ బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశ ప్రభుత్వాలు వారి పౌరులను హెచ్చరించాయి. ఒకవేళ ఎవరైనా అక్కడ ఉన్నా.. వెంటనే తిరిగి వచ్చేయాలని సూచించారు. అటు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం అమర్ నాథ్ యాత్రికులను సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని సూచించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు యాత్రికుల మీద దాడికి ప్రయత్నాలు జరుపుతున్నట్లు భారత ఆర్మీ ప్రకటించిన వెంటనే రాష్ట్ర యంత్రాంగం ఈ ప్రకటన చేసింది.

మరోవైపు కశ్మీర్ లోయలో గత వారం రోజులుగా పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం నిబంధనలు 35ఏ, 370 రద్దుచేసి, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించనుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా జమ్మూకాశ్మీర్ మూడు భాగాలుగా విడిపోనుందని కూడా తెలుస్తోంది.

Follow Us