AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cow Science Exam: గోశాస్త్రం పరీక్ష రాసేలా విద్యార్థులను ప్రోత్సహించండి.. వీసీలకు లేఖ రాసిన యూజీసీ

Kamdhenu Gau Vigyan Prachar-Prasar Examination: కామధేను గౌ విజ్ణాన ప్రచార్ ప్రసార్ ( గోశాస్త్రం ) పరీక్ష ఈ నెల 25న జరగనుంది. ఈ గోశాస్త్రం పరీక్ష రాసేలా విద్యార్థులందరినీ ప్రోత్సహించాలని..

Cow Science Exam: గోశాస్త్రం పరీక్ష రాసేలా విద్యార్థులను ప్రోత్సహించండి.. వీసీలకు లేఖ రాసిన యూజీసీ
University Grants Commission
Shaik Madar Saheb
|

Updated on: Feb 18, 2021 | 1:31 AM

Share

Kamdhenu Gau Vigyan Prachar-Prasar Examination: కామధేను గౌ విజ్ణాన ప్రచార్ ప్రసార్ ( గోశాస్త్రం ) పరీక్ష ఈ నెల 25న జరగనుంది. ఈ క్రమంలో గోశాస్త్రం పరీక్ష రాసేలా విద్యార్థులందరినీ ప్రోత్సహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్స్‌లర్లను కోరింది. ఫిబ్రవరి 25న జరిగే గోశాస్త్రం పరీక్షకు స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా.. అదేవిధంగా రాసేలా ప్రోత్సాహించాలని వీసీలకు యూజీసీ సెక్రెటరీ రజ్నీష్ జైన్ ప్రత్యేకంగా లేఖలు రాశారు. గోశాస్త్రంపై నిర్వహించే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా, రాసేలా విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థులను ప్రోత్సహించాలని.. దీంతోపాటు ఈ పరీక్షకు విశేష ప్రచారం కల్పించాలని ఆయన ఆ లేఖలో కోరారు.

పశుసంవర్ధక శాఖ సహకారంతో రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఈ పరీక్షను ఫిబ్రవరి 25న నిర్వహించనుంది. భారతీయ ఆవు.. ఆర్థిక, శాస్త్రీయ, ఆరోగ్య, వ్యవసాయ, పర్యవరణ, ఆధ్యాత్మికమైన విషయాల్లో ఈ పరీక్షను అన్ని భాషల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ కామధేను ఆయోగ్ పేర్కొంది. గంటసేపు జరిగే ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ పద్దతిలో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.

Also Read:

West Bengal: బెంగాల్ కార్మిక శాఖ మంత్రి జాకీర్ హుస్సేన్‌పై బాంబులతో దాడి.. తీవ్ర గాయాలు

Covid vaccine: కీలక నిర్ణయం తీసుకున్న భారత్.. శాంతి బలగాలకు బహుమతిగా 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు..