AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accidents: రెండు రాష్ట్రాల్లో రెండు ఘోర ప్రమాదాలు.. 25 మంది మృతి

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్రలోని శనివారం తెల్లవారుజామున రాయగఢ్ జిల్లా ఖొపలి ప్రాతంలో బస్సు బొల్తా పడింది.

Accidents: రెండు రాష్ట్రాల్లో రెండు ఘోర ప్రమాదాలు.. 25 మంది మృతి
Accident
Aravind B
|

Updated on: Apr 16, 2023 | 10:59 AM

Share

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్రలోని శనివారం తెల్లవారుజామున రాయగఢ్ జిల్లా ఖొపలి ప్రాతంలో బస్సు బొల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందగా.. 25 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. ఓ ట్రాక్టర్ ట్రాలీ ప్రమాదవశాత్తు అదుపు తప్పి వంతెన పై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అక్కడి స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో క్షతగాత్రుల బంధు మిత్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి