AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టకేలకు బోనులో చిక్కిన మ్యాన్‌ ఈటర్‌.. గత 3 ఏళ్లలో 11మంది బలి

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా చిచ్‌పల్లి అటవీ పరిధిలో గత మూడేళ్లుగా 11 మందిని చంపిన పులిని విజయవంతంగా బోనులో బంధించినట్లు అధికారులు తెలిపారు. గతంలో అటవీ శాఖ బోనులను ఏర్పాటు చేసినప్పటికీ ఈ పులి చౌకచక్యంగా తప్పించుకుందని చెప్పారు.

ఎట్టకేలకు బోనులో చిక్కిన మ్యాన్‌ ఈటర్‌.. గత 3 ఏళ్లలో 11మంది బలి
Tigress
Ram Naramaneni
|

Updated on: Sep 29, 2024 | 2:55 PM

Share

మహారాష్ట్రలో గత 3 ఏళ్లలో ఏకంగా 11 మంది ప్రాణాలు తీసింది ఈ మ్యాన్ ఈటర్. ప్రమాదకర టీ-83 అనే పెద్ద పులిని ఎట్టకేలకు బోనులో చిక్కింది. మత్తుమందు ఇచ్చి పులిని బంధించారు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు, సిబ్బంది. చంద్రపూర్‌ జిల్లా మూల్‌ తాలూకా చిచ్పల్లి అటవీక్షేత్రంలో పన్నిన బోనులో ఈ మ్యాన్‌ ఈటర్‌ చిక్కింది. జనాడా, కాంతాపేట్‌, చిరోలి, కరడేపేట్‌, చించాడా గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ.. ఇటీవల 15 రోజుల్లోనే నలుగురు పశువుల కాపరులను పొట్టన పెట్టుకుంది ఈ మ్యాన్‌ ఈటర్‌. దీంతో పశువుల కాపరులు, స్థానికులు రాత్రింబవళ్లు భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో మహా రాష్ట్ర అటవీశాఖ మంత్రి మునగంటివార్ ఆదేశాలతో పులిని పట్టుకునేందుకు రంగంలోకి‌ దిగిన అటవిశాఖ సిబ్బంది డ్రోన్‌ సాయంతో జనాడా గ్రామ పరిసర అడవుల్లో ఈ మ్యాన్‌ ఈటర్‌ను గుర్తించారు. షార్ప్‌ షూటర్‌ అజయ్‌ మరాఠీ సాయంతో పులికి మత్తుమందు ఇచ్చి బంధించారు. పులిని చంద్రపూర్‌ టైగర్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. దీంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us