AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: రేపు కేరళలో ప్రధాని మోడీ పర్యటన .. ఆత్మాహుతి దాడులు చేస్తామని వార్నింగ్.. హై అలర్ట్

ప్రధాని మోడీని చంపుతామని ఇచ్చిన వార్నింగ్‌ లెటర్‌ను సీరియస్‌గా తీసుకున్న ఇంటెలిజెన్స్ విభాగం.. దర్యాప్తు మొదలెట్టింది. ప్రధాని భద్రతా ప్రొటోకాల్స్‌పై ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు లీక్‌ కావడంతోనే ఈ లేఖ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.

PM Modi: రేపు కేరళలో ప్రధాని మోడీ పర్యటన .. ఆత్మాహుతి దాడులు చేస్తామని వార్నింగ్.. హై అలర్ట్
Pm Modi Kerala Tour
Surya Kala
|

Updated on: Apr 23, 2023 | 6:38 AM

Share

ప్రధాని నరేంద్ర మోడీ.. సోమవారం కేరళలో పర్యటించనున్నారు. అయితే ప్రధాని మోడీ పర్యటన సమయంలో ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. మోడీ పర్యటన సమయంలో ఆత్మాహుతి చేస్తమంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రాష్ట్ర బీజేపీ ఆఫీసుకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు.

ప్రధాని మోడీని చంపుతామని ఇచ్చిన వార్నింగ్‌ లెటర్‌ను సీరియస్‌గా తీసుకున్న ఇంటెలిజెన్స్ విభాగం.. దర్యాప్తు మొదలెట్టింది. ప్రధాని భద్రతా ప్రొటోకాల్స్‌పై ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు లీక్‌ కావడంతోనే ఈ లేఖ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. బెదిరింపు లేఖ కలకలంతో.  ప్రధాని కేరళ పర్యటనపై సందిగ్ధత ఏర్పడింది. అయితే, ప్రధాని టూర్‌ యథావిధిగా కొనసాగుతుందని చెప్పింది కేంద్ర హోమ్ శాఖ. ముందుగా ప్రధాని మోడీ కోచిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని.. అనంతరం తిరువనంతపురం చేరుకుని వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..