Terrorist Attacks: కాశ్మీర్ లో ఉగ్రవాదుల సరికొత్త వ్యూహం.. పార్ట్ టైం టెర్రరిజం.. భద్రతాదళాలకు సవాల్!

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో సోమవారం ఉగ్రవాదుల దాడిలో ఆర్మీ జెసిఓతో సహా 5 మంది సైనికులు వీరమరణం పొందారు. దాడి చేసిన ఉగ్రవాదులు చీకటిని సద్వినియోగం చేసుకొని తప్పించుకున్నారు.

Terrorist Attacks: కాశ్మీర్ లో ఉగ్రవాదుల సరికొత్త వ్యూహం.. పార్ట్ టైం టెర్రరిజం.. భద్రతాదళాలకు సవాల్!
Terrorist Attacks In Kshmir
Follow us

|

Updated on: Oct 12, 2021 | 2:51 PM

Terrorist Attacks: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో సోమవారం ఉగ్రవాదుల దాడిలో ఆర్మీ జెసిఓతో సహా 5 మంది సైనికులు వీరమరణం పొందారు. దాడి చేసిన ఉగ్రవాదులు చీకటిని సద్వినియోగం చేసుకొని తప్పించుకున్నారు. ఈ రోజుల్లో ఉగ్రవాదులు తమను గుర్తించలేని విధంగా ఒక సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. వాస్తవానికి, ఎల్ఓసీ(LOC) వద్ద కఠినంగా వ్యవహరించడం ద్వారా బోర్డర్ దాటి వచ్చే చొరబాట్లను ఆపడంలో సైన్యం విజయం సాధించింది. మరోవైపు, లోయలో, అనుమానిత యువకుల కుటుంబంతో పాటు సైన్యం కూడా కొత్త ఉగ్రవాదుల నియామకానికి దాదాపు చెక్ పెట్టింది. చాలా మంది యువకులను ప్రధాన జన జీవన స్రవంతిలోకి తీసుకుని వచ్చారు.

ఈ కారణాల వల్ల, తీవ్రవాద సంస్థలతో శాశ్వత తీవ్రవాదుల కొరత ఏర్పడింది. అందువల్ల, పాకిస్తాన్ నుండి పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలు పార్ట్ టైమ్ తీవ్రవాదుల నుండి దాడులు చేసే పద్ధతిని అవలంబిస్తున్నాయి. లోయలో కూర్చున్న హ్యాండ్లర్లకు పాకిస్తాన్ నుండి పంపిన సందేశాలను మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అడ్డగించాడంతో ఈ విషయం బయట పడిందని చెబుతున్నారు. ఈ సందేశాలు లోయలోని స్లీపర్ వ్యవస్థల నిర్వాహకులకు వస్తాయి.

ఇటీవల కాలంలో సామాన్య ప్రజలపై జరిగిన దాడుల్లో పాల్గొన్న వారు కొత్తవారు. వారికి ఇంతకు ముందు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న రికార్డు లేదు. తీవ్రవాద సంస్థలు భారీ మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఒకే ఒక్క దాడిలో వారిని ఉపయోగిస్తున్నాయి. ఆ తర్వాత తీవ్రవాద సంస్థలు వారితో సంబంధాలు తెంచుకుంటున్నాయి. దీంతో వారిని గుర్తించడం చాలా కష్టతరంగా మారింది. భద్రతా దళాలు అలాంటి పార్ట్ టైం టెర్రరిస్టుల దాడికి సంబంధించి 10 సంఘటనల జాబితాను సిద్ధం చేశాయి.

అందుకే పెరిగిన దాడులు..

కాశ్మీరీ వలసదారులు.. పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులకు కేంద్ర ప్రభుత్వం 4.1 మిలియన్లకు పైగా నివాస ధృవపత్రాలను జారీ చేసింది. ముస్లిమేతరులు దీనితో చాలా ఉత్సాహంగా ఉన్నారు. పాకిస్తాన్‌లో కూర్చున్న ఉగ్రవాదుల కోపానికి ఇది మొదటి ప్రధాన కారణం. అందుకే హిందువులే కాదు, సిక్కులను కూడా టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి, వారిలో భయాందోళనలు వ్యాపించాయి. ఇప్పుడు కాశ్మీర్ లో పౌరులు తీవ్రవాదుల సాఫ్ట్ టార్గెట్‌లు.

రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లోయలో హింస పెరగడం రెండు పరిణామాల కిందికి వస్తుంది. మొదటిది- దేశవ్యాప్తంగా 160 మందికి పైగా జర్నలిస్టులు జమ్మూ కాశ్మీర్, లడఖ్ అభివృద్ధి కార్యక్రమాలను చూడటానికి వచ్చారు. ఇది కాకుండా, ‘అవుట్‌రీచ్ ప్రోగ్రామ్’ కింద కేంద్ర మంత్రులు, ఎంపీల తరచుగా ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నారు. రెండవది- హోం మంత్రి అమిత్ షా అక్టోబర్ చివరిలో కాశ్మీర్ వెళ్లనున్నారు. ముస్లిమేతరులపై దాడి చేసిన అనుమానంతో 1000 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్క శ్రీనగర్‌లోనే 100 మందికి పైగా అనుమానితులను నిర్భందించారు.

370 ని తొలగించిన తరువాత, హిందువులు కాశ్మీర్ లోయను విడిచిపెట్టక పోవడమే ఉగ్రవాదుల భయాందోళనలకు కారణం.. అందుకోసమే దాడులను చేస్తున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్టికల్ 370 5 ఆగస్టు 2019 న తొలగించారు. అప్పటి నుండి, 5 ఆగస్టు 2021 వరకు ఒక్క హిందూ కుటుంబం కూడా స్థానభ్రంశం చెందలేదు. జమ్మూ కాశ్మీర్ పరిపాలన దీనిని తన విజయంగా పిలుస్తోంది. ఈ విషయం నిరంతరం ఉగ్రవాదులను కలవరపెడుతోంది. అందువల్ల, వారు ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ముస్లిమేతరులపై దాడులు ప్రారంభించారు.

Also Read: Mohammad Asraf: ఢిల్లీలో ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు.. దాడికి ప్లాన్ చేసిన ఉగ్రవాది అరెస్ట్..

PM Narendra Modi: అలాంటి వారితో దేశానికి ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!