Tamil Nadu: ఆకలిగా ఉందని షాప్కి వెళ్లిన విద్యార్థులు.. యజమాని ఆన్సర్తో షాక్.. ప్రకంపనలు సృష్టిస్తున్న వీడియో..
Tamil Nadu: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తినుబండారాలు కొనడానికి షాప్కి వెళ్లిన చిన్నారులను కులం పేరుతో దారుణంగా అవమానించారు..
Tamil Nadu: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తినుబండారాలు కొనడానికి షాప్కి వెళ్లిన చిన్నారులను కులం పేరుతో దారుణంగా అవమానించారు షాపు యజమాని. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తేంకాసి జిల్లా సంకరణకోవిల్లో చోటు చేసుకున్న ఈ ఘటన తమిళనాట పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. వివరాల్లోకెళితే.. స్కూల్కి వెళ్లేముందు ఆకలిగా ఉందని కొందరు చిన్నారు స్కూల్ ఎదుట ఉన్న దుకాణానికి వెళ్లారు. తినడానికి ఏమైనా ఇవ్వాలని కోరారు. అయితే, వారికి ఏమీ ఇవ్వలేదు. పైగా దళితులకు ఇక్కడికి రావడానికి వీల్లేదని వారి ముఖం మీదే చెప్పారు. తక్కువ కులం వారికి ఏమీ అమ్మకూడదని, వారిని దగ్గరికి కూడా రానివ్వకూడదని పంచాయితీలో నిర్ణయించినట్లు చిన్నారులకు తెలియజేశాడు యజమాని. దాంతో ఆ చిన్నారులు షాపు వద్ద నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
కాగా, ఈ ఘటనను అంతా ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. ఆ వీడియో కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించారు. గ్రామాన్ని సందర్శించారు. అసలేం జరిగిందనే దానిపై గ్రామస్తులను ఆరా తీస్తున్నారు. పోలీసులు సైతం ఎంటరై.. ఘటనపై విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. చిన్నారులను కులం పేరుతో దూరం పెడతారా? అంటూ ఫైర్ అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..