Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: బయట హోటల్‌ బోర్డు.. లోపల వేరే కత.. సడెన్ ఎంట్రీతో ఇచ్చిపడేసిన ఖాకీలు..

కాదేదీ ఇల్లీగల్ దందాకు అనర్హం. ఎక్కడ సందు దొరికితే.. దాన్నే ఆసరగా చేసుకోవడం.. లేదంటే.. ఉన్న అవకాశాన్నే అనుకూలంగా మార్చుకోవడం కేటుగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇల్లీగల్ దందాలు చేసే వారంతా ఇదే బాపతు. పైకి ఒక కలరింగ్ ఇస్తూ.. లోపల మాత్రం మరో వేషాలు వేస్తారు. అయితే, ఆ కతలు, ఆ వేషాలు అన్ని వేళలా వర్కౌట్ అవ్వవు కదా.

Tamil Nadu: బయట హోటల్‌ బోర్డు.. లోపల వేరే కత.. సడెన్ ఎంట్రీతో ఇచ్చిపడేసిన ఖాకీలు..
Tamil Nadu
Follow us
Shiva Prajapati

|

Updated on: May 04, 2023 | 12:44 PM

కాదేదీ ఇల్లీగల్ దందాకు అనర్హం. ఎక్కడ సందు దొరికితే.. దాన్నే ఆసరగా చేసుకోవడం.. లేదంటే.. ఉన్న అవకాశాన్నే అనుకూలంగా మార్చుకోవడం కేటుగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇల్లీగల్ దందాలు చేసే వారంతా ఇదే బాపతు. పైకి ఒక కలరింగ్ ఇస్తూ.. లోపల మాత్రం మరో వేషాలు వేస్తారు. అయితే, ఆ కతలు, ఆ వేషాలు అన్ని వేళలా వర్కౌట్ అవ్వవు కదా. వీరి విషయంలోనూ అదే జరిగింది. పోలీసులు సడెన్ ఎంట్రీ ఇచ్చి.. తమదైన స్టైల్‌లో చుక్కలు చూపించారు. ఇంతకీ ఆ కేటుగాళ్ల దందా ఏంది? పోలీసులు ఏం చేశారు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళనాడులో విగ్రహాల స్మగ్లింగ్‌ మాఫియా గుట్టురట్టయ్యింది. తిరువారూర్‌లో ముగ్గురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. వాళ్ల దగ్గర్నుంచి కోట్ల రూపాయల విలువైన అమ్మవారి విగ్రహాలు, పురాతన నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ముఠా చావు తెలివితేటలు చూపించింది. బయటేమో హోటల్‌ బోర్డ్‌ పెట్టారు. ఇడ్లీ, దోస, భోజనం దొరుకుతుందంటూ ఫ్లెక్సీ వేశారు. కానీ, అక్కడ దొరికేది ఇడ్లీలు, దోసెలు కాదు.. పురాతన విగ్రహాలు. అవును, హోటల్‌ పేరుతో పంచలోహ విగ్రహాలను అమ్ముతోంది ఈ ముఠా.

ఇదే అంశంపై పక్కా సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు.. రెయిడ్‌చేసి స్మగ్లింగ్‌ ముఠాకు చెక్‌ పెట్టారు. వాళ్ల దగ్గర్నుంచి రెండు పంచలోహ విగ్రహాలు, కొన్ని పురాతన కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..