AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్.. మీరు ముందు అది అధ్యయనం చేయాలంటూ సూచన..

భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఫైర్ అయ్యారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఓ పార్ట కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ..

Amit Shah: రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్.. మీరు ముందు అది అధ్యయనం చేయాలంటూ సూచన..
Amit Shah
Amarnadh Daneti
|

Updated on: Sep 11, 2022 | 1:27 PM

Share

Amit Shah: భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) పై కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా (Amit Shah) ఫైర్ అయ్యారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఓ పార్ట కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడానికి ముందుగా దేశ చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ బ్రాండ్‌ టీషర్ట్‌ ధరించి.. భారత్ జోడో యాత్రకు వెళ్లారని ఆరోపించారు. గతంలో పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ ప్రసంగాన్ని గుర్తుచేయాలనుకుంటున్నానంటూ భారత్‌ను అసలు ఒక దేశమే కాదని రాహుల్ వ్యాఖ్యానించారన్నారు. ఈ విషయాన్ని ఆయన ఏ పుస్తకంలో చదివారని ప్రశ్నించారు. ఇదొక దేశం.. దీని కోసం లక్షలాది మంది తమ ప్రాణాలను త్యాగం చేశారంటూ ఈవిషయాలు రాహుల్ గాంధీకి తెలియవని అమిత్‌ షా అన్నారు. రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేసేందుకు వెళ్లారు. అంతకంటే ముందు ఆయన దేశ చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని హితవుపలికారు. అభివృద్ధి కోసం కాదని.. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రపై బీజేపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. ప్రతి రోజూ జాతీయ స్థాయి నాయకులు రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) కూడా రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఐక్యతను ఎవరు దెబ్బతీశారని.. ఇప్పుడు ఇటువంటి యాత్ర చేపట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆమె రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరు సాహసించారో ఆయన ముందు సమాధానం చెప్పాలన్నారు. దేశం ముక్కలు ముక్కలవుతుంది అని నినాదాలు చేసిన వ్యక్తిని మీ పార్టీలో సభ్యుడిగా చేర్చుకున్నారని గుర్తుచేశారు. కర్ణాటక పర్యటనలో స్మృతి ఇరానీ ఈవ్యాఖ్యలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి
Follow Us
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే