AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: 9 నెలలు నిండాక ప్రవేట్ ఆస్పత్రికి గర్భిణీ.. అక్కడ స్కాన్ చేయగా షాకింగ్ నిజం

కడుపులో బిడ్డ పెరుగుతోందని నమ్మి 9 నెలలు ఆనందంగా గడిపిన ఓ మహిళకు షాకింగ్ నిజం తెలిసింది. గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆమె కడుపులోని గడ్డను బిడ్డగా భావించి నెలల పాటు చికిత్స అందించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు అనుమానంతో ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించుకోగా.. కడుపులో బిడ్డ కాదు గడ్డ పెరుగుతోందని తేలడంతో బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

Andhra: 9 నెలలు నిండాక ప్రవేట్ ఆస్పత్రికి గర్భిణీ.. అక్కడ స్కాన్ చేయగా షాకింగ్ నిజం
Gudivada Hospital
Ram Naramaneni
|

Updated on: Mar 12, 2026 | 1:35 PM

Share

ఆ మహిళ తనకు బిడ్డ పుడుతుందని అని ఎంత మురిసిపోయిందో.. కడుపులోని బిడ్డను కళ్లతో చూశాక.. తన దిష్టి కూడా తగలకుండా జాగ్రత్తలు చేయాలని ఎంత ఆరాపడిందో.. కానీ సరిగ్గా 9 నెలలు నిండిన తర్వాత కడుపులో ఉంది బిడ్డ కాదు గడ్డ అని తెలిసి ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. అసలు ఏం జరుగుతుందో అర్థంకాక నైరాశ్యంలోకి వెళ్లింది. గుడివాడలో వెలుగుచూసింది ఈ ఘటన. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో కడుపులోని గడ్డను.. బిడ్డగా చెబుతూ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు 9 నెలల పాటు వైద్యం చేశారు. నెలలు నిండుతున్నా.. బిడ్డలో కదలికలు లేవంటూ వైద్యులకు తెలిపింది సదరు మహిళ. దీంతో కనీస సమాచారం ఇవ్వకపోగా.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి పంపించేశారు అక్కడి సిబ్బంది. కడుపుతీపితో 9 నెలలు అక్కడి వైద్యులు చెప్పిన టీకాలు అంగన్వాడీ సెంటర్‌లోనూ వేయించుకుంది ఆ మహిళ. ఆఖరికి అనుమానంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకోగా.. బిడ్డ లేదు పెరిగింది గడ్డ అని అక్కడి వైద్యులు తేల్చి చెప్పారు. స్కానింగ్ రిపోర్టు తీసుకెళ్లి గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల్ని ప్రశ్నించగా.. వాళ్లు నీళ్లు నములుతూ పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పేదవాడికి నాణ్యమైన వైద్యం, విద్య అందినరోజే ఆ రాజ్యం గొప్పగా ముందుకు సాగుతున్నట్లు. ఇలాంటి కొంతమంది ప్రభుత్వ సిబ్బంది తీరు వల్ల.. ప్రభుత్వ వ్యవస్థలపైనే నమ్మకం లేకుండా పోతుంది.

Also Read: ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్.. సాకారం కాబోతున్న చిరకాల వాంఛ 

Follow Us
వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్
వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్
రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి
రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి
వేసవి వేడిలో పక్షులకు వరం.. విద్యార్థుల వినూత్న చర్య
వేసవి వేడిలో పక్షులకు వరం.. విద్యార్థుల వినూత్న చర్య
అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..
అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..
మహేష్‌కు తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్
మహేష్‌కు తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్
శ్రీకాంత్ భార్య ఊహ మేనమామ తెలుగులో ఎంత పెద్ద నటుడో తెలుసా.. ?
శ్రీకాంత్ భార్య ఊహ మేనమామ తెలుగులో ఎంత పెద్ద నటుడో తెలుసా.. ?
కారు సీటే టాయిలెట్‌గా మారితే? సరికొత్త ఐడియా.. ఇక లాంగ్ ట్రిప్స్
కారు సీటే టాయిలెట్‌గా మారితే? సరికొత్త ఐడియా.. ఇక లాంగ్ ట్రిప్స్
ఫోటో చూస్తే మీ కళ్లు మోసం చేస్తాయ్.. అసలు పే..ద్ద కథ తెలిస్తే
ఫోటో చూస్తే మీ కళ్లు మోసం చేస్తాయ్.. అసలు పే..ద్ద కథ తెలిస్తే
అదృష్టాన్ని మార్చే రాగి ఉంగరం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు..!
అదృష్టాన్ని మార్చే రాగి ఉంగరం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు..!
రూ.వెయ్యికే మూడు నెలల పాటు ఇంటర్నెట్..
రూ.వెయ్యికే మూడు నెలల పాటు ఇంటర్నెట్..