AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Political Crisis: సీఎం షిండేకు భారీ ఊరట.. మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

చీఫ్‌ విప్‌ నియామకంపై అప్పటి మహారాష్ట్ర గవర్నర్‌ , స్పీకర్‌ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అయితే ఉద్దవ్‌థాక్రే విశ్వాసపరీక్షను ఎదుర్కోలేదని , అందుకే ఆయన్ను తిరిగి సీఎంగా నియమించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం షిండేకు ఊరట లభించింది.

Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: May 11, 2023 | 5:21 PM

Share

మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. చీఫ్‌ విప్‌ నియామకంపై అప్పటి మహారాష్ట్ర గవర్నర్‌ , స్పీకర్‌ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అయితే ఉద్దవ్‌థాక్రే విశ్వాసపరీక్షను ఎదుర్కోలేదని , అందుకే ఆయన్ను తిరిగి సీఎంగా నియమించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం షిండేకు ఊరట లభించింది. అంతేకాకుండా షిండే వర్గానికి చెందిన ఎమ్మల్యేలపై అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని , ఈవిషయంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

సుప్రీంకోర్టు తీర్పుతో మహారాష్ట్రలో షిండే సర్కార్‌కు ఢోకా లేదు. ఉద్దవ్‌ ఠాక్రే వర్గానికి తీర్పు ఎదురుదెబ్బగానే భావించాలి. రాజకీయ సంక్షోభం సమయంలో స్పీకర్‌ ఎలాంటి పాత్రను నిర్వహించాలన్న విషయంపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం నిర్ణయం తీసుకోబోతంది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయకుంటే కోర్టు ఆయనకు ఉపశమనం కలిగించేదని సీజేఐ తీర్పులో వెల్లడించడం విశేషం.

ఈ ప్రత్యేక కేసు మెరిట్‌పై నిర్ణయం తీసుకున్నామని సీజేఐ తెలిపారు. కార్యనిర్వాహకవర్గాన్ని జవాబుదారీగా చేయడం ప్రజలచే నేరుగా ఎన్నుకోబడిన శాసనసభ్యుల విధి అని CJI అన్నారు. ఆర్టికల్ 212 అంటే సభకు సంబంధించిన అన్ని విధానపరమైన లోపాలు న్యాయ సమీక్ష పరిధికి మించినవి అని అర్థం కాదని CJI అన్నారు. అసలు విప్‌ను స్పీకర్ పరిశీలించలేదని కోర్టు పేర్కొంది. గోగావాలేను విప్‌గా చేయాలనే నిర్ణయం సరికాదని సీజేఐ అన్నారు.

షిండే వర్గానికి చెందిన నేతను స్పీకర్‌ చీఫ్‌ విప్‌గా చేయలేమని సీజేఐ తెలిపారు. ఈ వ్యవహారంలో సీజేఐ పాత్రపై కూడా సీజేఐ ప్రశ్నలు సంధించారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగం ప్రకారం లేదని కోర్టు పేర్కొంది. ఉద్ధవ్ ఠాక్రే బలపరీక్షను ఎదుర్కోలేదని ఆయన అన్నారు. అందువల్ల వారికి ఎలాంటి ఉపశమనం లభించదు.

దీని కారణంగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (MVA) సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. ఈ సందర్భంలో, ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ, సిఎం షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలను ఈ రోజు అనర్హులుగా ప్రకటిస్తే, ఈ ద్రోహుల గుంపు అంతం అవుతుంది. సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో ప్రచురించిన కారణాల జాబితా ప్రకారం, జస్టిస్ చంద్రచూడ్ ఈ విషయంలో తీర్పును ప్రకటిస్తారు.

రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పి.ఎస్. నరసింహులు కూడా ఉన్నారు. సంబంధిత పిటిషన్లపై విచారణను పూర్తి చేసిన తర్వాత రాజ్యాంగ ధర్మాసనం తన నిర్ణయాన్ని మార్చి 16, 2023న రిజర్వ్ చేసింది. ఈ కేసులో తుది విచారణ ఫిబ్రవరి 21న ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్‌లో ఉంచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం