Police: రూ.10 పల్లీల కోసం ఎస్సై కక్కుర్తి.. కొంప కొల్లేరు అయిందిగా
ఏయ్.. నేను పోలీస్ తెలుసా..? నన్నె డబ్బులు అడుగుతావా..? ఏం చేసుకుంటావ్ చేసుకో.. ఇలాంటివి ఎన్నో సంఘటనలను మనం చూసి ఉంటాం.. కొందరు చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని బెదిరిస్తూ.. వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం, బెదిరించి ఆహార పదార్థాలు తీసుకెళ్లడం.. లాంటి ఘటనలు సైతం జరిగిన సందర్భాలు ఉన్నాయి.. ఖాకీ డ్రెస్ వేసుకోగానే కొందరు ఇలా ప్రవర్తిస్తూ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే మాయని మచ్చ తెస్తుంటారు..
ఏయ్.. నేను పోలీస్ తెలుసా..? నన్నె డబ్బులు అడుగుతావా..? ఏం చేసుకుంటావ్ చేసుకో.. ఇలాంటివి ఎన్నో సంఘటనలను మనం చూసి ఉంటాం.. కొందరు చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని బెదిరిస్తూ.. వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం, బెదిరించి ఆహార పదార్థాలు తీసుకెళ్లడం.. లాంటి ఘటనలు సైతం జరిగిన సందర్భాలు ఉన్నాయి.. ఖాకీ డ్రెస్ వేసుకోగానే కొందరు ఇలా ప్రవర్తిస్తూ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే మాయని మచ్చ తెస్తుంటారు.. తాజాగా.. అలాంటి ఘటనే ఓ ఎస్ఐ కొంప ముంచింది.. దుకాణం రూ. 10 పల్లీల ప్యాకెట్ కొన్న ఓ ఎస్ఐ.. డబ్బులు ఇవ్వమన్నందుకు చిర్రుబుర్రులాడాడు.. నన్నే 10 రూపాయలు అడుగుతావా..? అంటూ దుకాణదారుడిని బెదిరించాడు.. దీంతో మాటమాట పెరిగి ఫిర్యాదు వరకు వెళ్లింది.. చివరకు ఎస్ఐను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది..
పోలీసు స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఎస్ఐ) తన వద్ద కొనుగోలు చేసిన వేరుశెనగకు రూ.10 అడిగినందుకు బెదిరించాడని.. తిరుచ్చిలోని పోలీసు కమిషనర్కు విక్రేత చేసిన ఫిర్యాదు చేశాడు.. దీంతో దర్యాప్తు చేసిన అధికారులు బుధవారం అతన్ని సస్పెండ్ చేశారు.
వివరాల ప్రకారం.. మంగళవారం శ్రీరంగం రాజగోపురం వద్ద రాజన్ ప్రేమ్కుమార్కు చెందిన స్నాక్స్ స్టాల్ వద్దకు శ్రీరంగం ఎస్ఎస్ఐ రాధాకృష్ణన్ వచ్చి రూ.10 విలువ చేసే పల్లీల ప్యాకెట్ ను కొనుగోలు చేశాడు.. దీంతో ప్రేమ్ కుమార్ కుమారుడు ఎస్ఐను డబ్బులు అడిగాడు. చెల్లించడానికి నిరాకరించిన SSI వ్యాపారిని దుర్భషలాడాడు..అంతేకాకుండా నన్నే డబ్బులు అడుగుతావా..? అంటూ బెదిరించాడు. ఇది వాగ్వాదానికి దారితీసింది.. అక్కడ ఉన్న ప్రేమ్ కుమార్ పోలీసులను శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు.. అయినా కానీ వినకుండా SSI అతనిని దుర్భాషలాడాడు.
ఇంతలో, రాజన్ ప్రేమ్ కుమార్ తన దుకాణం దగ్గరున్న సిసిటివి ఫుటేజీ వీడియో క్లిప్పింగ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. అంతడితో ఆగకుండా వీడియో రికార్డింగ్తో నగర పోలీస్ కమిషనర్ ఎన్ కామినికి ఫిర్యాదు కూడా చేశాడు. ఫిర్యాదు మేరకు ఎస్సై రాధాకృష్ణను కమిషనర్ సస్పెండ్ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే పోలీసు సిబ్బందికి కూడా కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు అండగా ఉండే పోలీసులు ఇలాంటివి చేయొద్దంటూ పోలీసులకు సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..