AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖగోళంలో అద్భుత దృశ్యాలు.. సూర్యుడిని మింగనున్న చంద్రుడు

ప్రపంచ వ్యాప్తంగా సూర్య గ్రహణం ప్రారంభమైంది. భారత దేశంతో పాటు.. ఇతర దేశాల్లోనూ ఈ గ్రహణం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రాలో కూడా ప్రజలు దీన్ని చూసేందుకు వీలుంది. అయితై నేరుగా కాకుండా.. ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించి దీన్ని చూడవచ్చు. ఈ సారి వస్తోన్న సూర్య గ్రహణాన్ని 'రింగ్ ఆఫ్ ఫైర్'...

ఖగోళంలో అద్భుత దృశ్యాలు.. సూర్యుడిని మింగనున్న చంద్రుడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2020 | 12:16 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా సూర్య గ్రహణం ప్రారంభమైంది. భారత దేశంతో పాటు.. ఇతర దేశాల్లోనూ ఈ గ్రహణం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రాలో కూడా ప్రజలు దీన్ని చూసేందుకు వీలుంది. అయితై నేరుగా కాకుండా.. ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించి దీన్ని చూడవచ్చు. ఈ సారి వస్తోన్న సూర్య గ్రహణాన్ని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఏర్పడే సమయంలో.. భూమి, సూర్యుడి మధ్యలో చందమామ అడ్డుగా వస్తుంది. చందమామ పూర్తిగా సూర్యుణ్ని మూసివేసినప్పుడు నల్లటి చందమామ చుట్టూ రింగ్ లాంటి ఆకారం ఏర్పడుతుంది. ఉదయం 9.15కి మొదలైన ఈ గ్రహణం.. సాయంత్రం 3.04కి వీడుతుంది. కాగా మధ్యాహ్నం 12.10 నిమిషాలకు పూర్తి స్థాయిలో సూర్యుడు, చంద్రుడు ఒకే వరుసలోకి రానున్నారు. ఢిల్లీ, జమ్ముకశ్మీర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశాల్లో ఈ గ్రహణం కనువిందు చేస్తోంది.

Read More:

వాహనదారులపై భారీ భారం.. 15 రోజుల్లో రూ.8 పెరుగుదల..

బ్రేకింగ్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్‌కి కరోనా పాజిటివ్..

విపరీతంగా కరోనా కేసులు.. ఉద్యోగులకు కీలక మార్గదర్శకాలు‌: హైకోర్టు

ఏపీ ఎమ్మెల్యే గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్..