AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh: వామ్మో ఏంటి ఈ దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగుర్ని చంపిన మరో కుటుంబం

మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భూవివాదం వల్ల రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే మోరేనా జిల్లా లేపా గ్రామంలో ధీర్ సింగ్ తోమర్, గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబాలు నివసిస్తున్నాయి.

Madhya Pradesh: వామ్మో ఏంటి ఈ దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగుర్ని చంపిన మరో కుటుంబం
Gun Shooting
Aravind B
|

Updated on: May 05, 2023 | 5:30 PM

Share

మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భూవివాదం వల్ల రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే మోరేనా జిల్లా లేపా గ్రామంలో ధీర్ సింగ్ తోమర్, గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే 2013లో వ్యర్థపదార్థాలు డంపింగ్ చేసే విషయంలో ఈ రెండు కుటంబాల మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవలో ధీర్ సింగ్ తోమార్ కుటుంబానికి ఇద్దరు చనిపోవడంతో.. గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబం ఆ గ్రామం నుంచి పారిపోయింది. ఆ తర్వాత కోర్టులో ఇరు కుటుంబాలు రాజీ కుదుర్చుకున్నాయి. శుక్రవారం రోజున గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబం మళ్లీ ఆ గ్రామానికి తిరిగివచ్చింది.

అయితే గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబంపై ఉన్న ప్రతికారంతో ధీర్ సింగ్ కుటుంబ సభ్యలు వాళ్లపై కర్రలతో దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో గజేంద్ర సింగ్ తోమర్, అతని ఇద్దరు కొడుకులతో పాటు ఆ కుటుంబంలోని మరో ముగ్గురు మహిళలు చనిపోయారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గుర్ని ఆసుపత్రికి తరలిస్తుండగా బుల్లెట్ గాయాలతో ప్రాణాలు విడిచారు. ఇలా మొత్తం ఒకే కుటుంబంలోని ఆరుగురు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు 8 మంది నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఉన్న భూవివాదం శత్రుత్వంతోనే ఇరు కుటుంబాలు దాడులు చేసుకున్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రోగాలను బెదరగొట్టే అద్భుత ఫుడ్‎ను రెండు ముద్దలు తింటే చాలు
రోగాలను బెదరగొట్టే అద్భుత ఫుడ్‎ను రెండు ముద్దలు తింటే చాలు
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
మహిళలు గుండు చేసుకుంటే రూ. 45వేలు.. కట్ చేస్తే..!
మహిళలు గుండు చేసుకుంటే రూ. 45వేలు.. కట్ చేస్తే..!
ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి..
ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి..
టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..
టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..
గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలను ఎలా తొలగించాలి? సింపుల్‌ ట్రిక్
గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలను ఎలా తొలగించాలి? సింపుల్‌ ట్రిక్
ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలు..
ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలు..
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. సోలార్ పంపుకు 90% సబ్సిడీ!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. సోలార్ పంపుకు 90% సబ్సిడీ!
హైదరాబాద్ ప్రయాణికుడి కేసు.. రైల్వే తిక్క కుదిర్చిన కోర్టు
హైదరాబాద్ ప్రయాణికుడి కేసు.. రైల్వే తిక్క కుదిర్చిన కోర్టు
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు