AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: ప్రతిపక్ష పార్టీలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై వేసిన పిటీషన్ పై సుప్రీం ఏమందంటే..

సుప్రీం కోర్టులో ప్రతిపక్ష పార్టీలకు చుక్కెదురైంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని..ఇటీవల 14 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

Supreme Court: ప్రతిపక్ష పార్టీలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై వేసిన పిటీషన్ పై సుప్రీం ఏమందంటే..
Supreme Court
Aravind B
|

Updated on: Apr 05, 2023 | 5:59 PM

Share

సుప్రీం కోర్టులో ప్రతిపక్ష పార్టీలకు చుక్కెదురైంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని..ఇటీవల 14 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తమను వేధించేందుకు,బెదిరించేందుకు దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని పిటీషన్ లో ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీం ను కోరారు. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీల తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మాను సింగ్వీ పిటీషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఈ పిటీషన్ పై స్పందించింది. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకునేందుకు తిరస్కరిస్తున్నామని తేల్చిచెప్పేసింది.

ఈ పిటీషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ దీనిపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు విచారణల నుంచి..శిక్షల నుంచి తప్పించుకుకోవాలని మీరు కోరుతున్నారా అని విపక్షల తరపున పిటీషన్ దాఖలు చేసిన అభిషేక్ మాను సింగ్వీని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సింగ్వీ ప్రతిపక్ష నాయకులకు ఎటువంటి మినహాయింపును..రక్షణను కల్పించాలని తాను కోరడం లేదని.. కేవలం పక్షపాత ధోరణి లేని చట్టం కోసం మాత్రమేనని బదులిచ్చారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే చాలామంది విపక్ష నేతల్ని అరెస్టు చేశారని ఆరోపించారు. అయినప్పటికీ చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ సింగ్వీ వాదనలను అంగీకరించలేదు.రాజకీయ నాయకులు అయినంత మాత్రానా వారి కోసం సుప్రీం కోర్టు తన మార్గదర్శకాలను, విధానాలను మార్చకోలేదని స్పష్టం చేశారు. ఇటువంటి ఆందోళనలు పార్లమెంట్ లో ప్రశ్నించాలని సూచించారు. ఆ తర్వాత సింగ్వీ తన పిటీషన్ ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేసే ప్రత్యేక కేసులు, సందర్భాలు వచ్చినప్పడు మళ్లీ కోర్టుకి వస్తానని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!