Supreme Court: బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. దోషులకు క్షమాభిక్ష రద్దు..
బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషుల శిక్షను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుబడుతూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషుల శిక్షను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుబడుతూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 2002నాటి గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచారానికి ఒడిగట్టిన 11 మంది రేపిస్టులను విడుదల చేస్తూ, గుజరాత్ ప్రభుత్వం గత ఏడాది తీసుకున్న నిర్ణయం చెల్లదని ధర్మాసనం తేల్చిచెప్పింది. రేపిస్టులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని కరాఖండీగా చెప్పింది. 11 మంది రేపిస్టుల విడుదలను సవాల్చేస్తూ, బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత ఉందని సుప్రీం తెలిపింది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో, 11 మంది రేపిస్టులు మళ్లీ జైల్లో లొంగిపోవడం ఖాయమైంది. వీరిని 2022 ఆగస్ట్ 15వ తేదీన గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.
బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గతేడాది గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. వారికి రెమిషన్ మంజూరు చేసి జైలు నుంచి బయటకు విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు బాధితురాలు బిల్కిస్ బానో. ఈ కేసులో దోషులుగా జీవితఖైదు అనుభవిస్తున్న వారిని జైలు నుంచి విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు బల్కిస్ బానో. ఈ కేసుకు పూర్వాపరాలు పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు బిల్కిస్ బానో పిటిషన్ వేయడం సరైనదే అని తేల్చింది. దీంతోపాటు 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి చెల్లుచీటి ఇచ్చింది.
ఈ కేసును పూర్తిగా పరిశీలించినట్లైతే.. 2002 లో జరిగిన గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో 5 నెలల గర్భిణిగా ఉన్నారు. ఆ సమయంలో కొందరు ఆగంతకులు.. గర్భిణీ అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా కుటుంబంలోని వారిని చిన్నా పెద్దా అని చూడకుండా ఏడుగురిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21 వ తేదీన జీవిత ఖైదు విధించింది. అయితే గతేడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ 11 మంది దోషులకు రెమిషన్ పై విడుదల చేశారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అప్పట్లో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బాధితురాలు బిల్కిస్ బానో గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ 11 మంది నిందితులు తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..