AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

No Fuel: వాహనదారులకు షాక్‌.. ఈ వాహనాలకు ఏప్రిల్ 1 నుండి నో పెట్రోల్, డీజిల్

No Fuel: వాహనదారులకు షాకింగ్‌ న్యూస్‌.. ఎందుకంటే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ వేసుకునేందుకు అనుమతి ఉండదు. ఆ వాహనాలకు ప్రభుత్వం నిషేధించింది. ఈ విధానం దీని ద్వారా వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా సమాచారం అందిస్తుంది..

No Fuel: వాహనదారులకు షాక్‌.. ఈ వాహనాలకు ఏప్రిల్ 1 నుండి నో పెట్రోల్, డీజిల్
Subhash Goud
|

Updated on: Mar 24, 2025 | 7:09 PM

Share

కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. దీని కింద పాత వాహనాలకు పెట్రోల్ పంపుల వద్ద పెట్రోల్ లేదా డీజిల్ వేసుకునేందుకు అనుమతి ఉండదు. ఏప్రిల్ 1 నుండి నగరంలోని పెట్రోల్ పంపులలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నిర్దేశించిన వయోపరిమితి కంటే ఎక్కువ ఉన్న వాహనాలను గుర్తించడంలో ఈ ANPR కెమెరాలు సహాయపడతాయి. దీనితో పెట్రోల్ పంపులు అటువంటి వాహనాలకు ఇంధనం ఇవ్వడానికి నిరాకరిస్తాయి.

ఎలాంటి వాహనాలకు ఈ నిబంధనలు:

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ నియమం ఏప్రిల్ 1 నుండి ఢిల్లీలో అమల్లోకి వస్తుంది. ఢిల్లీ అంతటా పాత వాహనాలు పెట్రోల్, డీజిల్‌ను వినియోగించకుండా నిరోధించడం ద్వారా ప్రభుత్వ ఆదేశాలను మెరుగ్గా పాటించడం ఈ చొరవ లక్ష్యం. ఇప్పుడు ఈ నియమం ఎన్ని పాత వాహనాలకు వర్తిస్తుందనేది ప్రశ్న. ఎన్‌జీటీ మార్గదర్శకాల ప్రకారం, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలకు, 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలకు ఇంధనం నింపడం నిషేధించనుంది.

ANPR ఎలా పని చేస్తుంది?

పెట్రోల్ పంపుల వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు వాహనాల తయారీ సంవత్సరాన్ని స్కాన్ చేస్తాయి. అంటే వాహనం వయస్సు NGT నిర్ణయించినదానికంటే ఎక్కువగా ఉంటే అలాంటి వారికి పెట్రోల్‌, డీజిల్‌ ఉండదు. ఈ కెమెరాలు నిజ సమయంలో నంబర్ ప్లేట్‌లను స్కాన్‌ చేయడం ద్వారా వాహనాలను గుర్తిస్తాయి. ఢిల్లీలో దాదాపు 500 పెట్రోల్ పంపులు ఉన్నాయి. వీటిలో 80% ఇప్పటికే ANPRలను ఏర్పాటు చేశాయి. వాహనం తయారైన సంవత్సరం బట్టి పెట్రోల్‌, డీజిల్‌ను వేయనున్నారు. వాహన వయోపరిమితిని గుర్తించి దానిని డిఫాల్టర్‌గా ప్రకటిస్తుంది.

ఉల్లంఘిస్తేం ఏం అవుతుంది?

ఈ మొత్తం ప్రక్రియ వాహన్ పోర్టల్‌కు అనుసంధానించబడి ఉంటుంది. దీని ద్వారా వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా సమాచారం అందిస్తుంది. ఇది కాకుండా, ఏదైనా పాత వాహనం మళ్లీ రోడ్డుపై కనిపిస్తే, దానిని స్క్రాప్ యార్డ్‌కు పంపుతారు. ప్రభుత్వం ఇప్పటివరకు 59 లక్షల పాత వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. కానీ ఇప్పటికీ చాలా వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. ఏదైనా వాహనం ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వాహన యజమాని రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మళ్లీ పట్టుబడితే దానిని రద్దు చేస్తారు.

ఇది కూడా చదవండి: IPL 2025: మీరు క్రికెట్‌ అభిమానులా..? జియో, ఎయిర్‌టెల్, విఐ ప్రత్యేక డేటా ప్యాక్‌లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us