AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచారం అప్పటి నుంచే.. ఈ ప్రాంతంలో తొలి సభకు శ్రీకారం..

దేశంలోని అన్ని పార్టీల చూపు లోక్ సభ ఎన్నికల మీదే ఉంది. ఎలాగైనా మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక కాంగ్రెస్ కూడా అన్ని ప్రాంతీయ పార్టీలతో మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే.. రాజకీయ పార్టీలు తమ ప్రచార అస్త్రాలను ఇప్పటి నుంచే సిద్దం చేసుకుంటున్నాయి.

PM Modi: బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచారం అప్పటి నుంచే.. ఈ ప్రాంతంలో తొలి సభకు శ్రీకారం..
Pm Modi
Srikar T
|

Updated on: Jan 07, 2024 | 4:11 PM

Share

దేశంలోని అన్ని పార్టీల చూపు లోక్ సభ ఎన్నికల మీదే ఉంది. ఎలాగైనా మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక కాంగ్రెస్ కూడా అన్ని ప్రాంతీయ పార్టీలతో మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే.. రాజకీయ పార్టీలు తమ ప్రచార అస్త్రాలను ఇప్పటి నుంచే సిద్దం చేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో మరోసారి పాదయాత్ర చేయబోతున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్దమైంది.

ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కూడా తన లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 13 నుంచి మోదీ ఎన్నికల ప్రచారాన్ని పారంభించనున్నట్లు అధికారికంగా తెలుస్తోంది. తొలి సభ బిహార్ నుంచే ప్రారంభం కానున్నట్లు బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 40 స్థానాలు ఉన్న బిహార్ ను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. రాష్ట్రంలోని బేగూసరాయ్‌, బెతియా, ఔరంగాబాద్‌లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

బిహార్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు వివిధ ప్రచార సభల్లో పాల్గొననున్నట్లు సమాచారం. జనవరి 15 తర్వాత ముమ్మర ప్రచారం ఉంటుందని సమాచారం. సీతామఢి, మధేపురా, నలందాల్లో అమిత్‌షా పాల్గొననుండగా సీమాంచల్‌లో జేపీ నడ్డా పర్యటించనున్నారు. బీజేపీకి ధీటుగా విపక్ష కూటమి ఇండియాలో కీలక భూమిక పోషిస్తున్న ప్రస్తుత బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి రేసులో ఉన్న ఈయన గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్పైసీ మలై పనీర్ రెసిపీ..
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే స్పైసీ మలై పనీర్ రెసిపీ..
సూర్యకుమార్ యాదవ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
సూర్యకుమార్ యాదవ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే..
2026లో మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేసే వాస్తు రహస్యాలు ఇవే..
ఈ విషయంలో పురుషులకంటే స్త్రీలే 100శాతం బెటర్.. సాటి ఎవ్వరూ లేరు
ఈ విషయంలో పురుషులకంటే స్త్రీలే 100శాతం బెటర్.. సాటి ఎవ్వరూ లేరు
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
తండ్రి ముగ్గురు కొడుకులకు భలే బుద్ధి చెప్పిన పోలీసులు
తండ్రి ముగ్గురు కొడుకులకు భలే బుద్ధి చెప్పిన పోలీసులు
రైల్వే ట్రాక్‌పై పిచ్చివేశాలు వేస్తూ రీల్స్ తీసిన యువకుడు
రైల్వే ట్రాక్‌పై పిచ్చివేశాలు వేస్తూ రీల్స్ తీసిన యువకుడు
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో