AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మహిళలకు రైళ్లలో రిజర్వేషన్‎తో పాటు మెరుగైన సౌకర్యాలు.. రైల్వే శాఖ మంత్రి..

రైళ్లలో మహిళా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే అనేక చర్యలు తీసుకుంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు...

Indian Railways: మహిళలకు రైళ్లలో రిజర్వేషన్‎తో పాటు మెరుగైన సౌకర్యాలు.. రైల్వే శాఖ మంత్రి..
Railway
Srinivas Chekkilla
|

Updated on: Dec 19, 2021 | 7:24 AM

Share

రైళ్లలో మహిళా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే అనేక చర్యలు తీసుకుంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వారికి సీటు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు మహిళా ప్రయాణీకులకు వారి ప్రయాణ సమయంలో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సుదూర మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్‌లో ఆరు బెర్త్‌ల రిజర్వేషన్ కోటా, గరీబ్ రథ్, రాజధాని, దురంతోలోని 3ఏసీ క్లాస్‌లో ఆరు బెర్త్‌ల రిజర్వేషన్ కోటా, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మహిళా ప్రయాణికుల కోసం కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఇది వారి వయస్సుతో సంబంధం లేకుండా ఉంటుందన్నారు. స్లీపర్ క్లాస్‌లో ఒక కోచ్‌కు ఆరు నుంచి ఏడు లోయర్ బెర్త్‌లు, ఒక్కో కోచ్‌కు నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్‌లు కలిపి రిజర్వేషన్ కోటా- కండిషన్డ్ 3 టైర్ (3AC), ఎయిర్ కండిషన్డ్ 2 టైర్ (2AC) తరగతుల్లో ఒక్కో కోచ్‌కి మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్‌లు (రైలులో ఆ తరగతి కోచ్‌ల సంఖ్యను బట్టి) సీనియర్ సిటిజన్‌లు, 45 ఏళ్ల మహిళా ప్రయాణికుల కోసం కేటాయించనున్నారు.

భద్రతా చర్యలు

ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికులకు భద్రత కల్పించడంపై తమ దృష్టి అని వైష్ణవ్ తెలిపారు. మంచి శిక్షణ పొందిన మహిళా అధికారులు, సిబ్బందిని బృందాలు ఏర్పాటు చేశామన్నారు. రైళ్లు, స్టేషన్లలో మహిళలతో సహా ప్రయాణికుల భద్రత కోసం భారతీయ రైల్వేలు GRPతో సమన్వయంతో పని చేస్తాయని మంత్రి తెలిపారు. రైలు ఎక్కిన స్టేషన్ నుంచి దిగే స్టేషన్ వరకు మహిళా ప్రయాణీకులకు మెరుగైన భద్రత అందించడానికి “మేరీ సహేలి”ని RPF గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించిందని ఆయన చెప్పారు.

రైళ్లను RPF, వివిధ రాష్ట్రాల GRP రైళ్లలో మహిళలకు ఎస్కార్ట్ చేస్తారు. ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికులపై హాల్టింగ్ స్టేషన్‌ల వద్ద అదనపు నిఘా ఉంచాలని చెప్పారు. మహిళలకు కేటాయించిన కంపార్ట్‌మెంట్లలోకి పురుషుల ప్రవేశించకుండా తనిఖీలు చేయాలన్నారు. భద్రతను పెంచడానికి 4,934 కోచ్‌లు, 838 రైల్వే స్టేషన్‌లలో CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు.

CCTV, సోషల్ మీడియా

ఆపదలో ఉన్న ప్రయాణికులు భారతీయ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 ఫోన్ చేయవచ్చు. ఇది (24×7) పనిచేస్తోంది. ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వారి భద్రతా సమస్యలను పరిష్కరించడానికి జాతీయ రవాణాదారు మహిళలతో సహా ప్రయాణికులతో టచ్‌లో ఉన్నారని మంత్రి తెలిపారు. దొంగతనాలు, స్నాచింగ్‌లు, డ్రగ్స్‌ వంటి వాటిపై జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా తరచుగా ప్రకటనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read Also.. PM Modi in UP: యోగి వైపే యూపీ ప్రజలు.. ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు