AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నా.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..

పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత సాయుధ దళాలు బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి.

భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నా.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
Rahul Gandhi Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: May 07, 2025 | 9:57 AM

Share

పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత సాయుధ దళాలు బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి. ఆపరేషన్ సిందూర్ పై అభినందనలు వ్యక్తమవుతున్నాయి.. మేరా భారత్ మహాన్, జైహింద్ అంటూ అందరూ ట్వీట్ లు చేస్తున్నారు.

ఆపరేషన్ సిందూర్ పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..

కాగా.. ఆపరేషన్‌ సింధూర్‌పై లోకసభలోని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. మన భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నా అన్నారు రాహుల్. జై హింద్ అంటూ రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.

ఆపరేషన్‌ సింధూర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్..

ఆపరేషన్‌ సింధూర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు గర్వపడేలా చేస్తున్నాయన్నారు. సాయుధ దళాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం.. జై హింద్ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.

అత్యవసర సమీక్ష..

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులతో.. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తక్షణమే హైదరాబాద్ బయల్దేరి రావాలని సూచించారు. తాజా పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని.. అన్ని విభాగాల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా.. సాయంత్రం జరిగే మాక్ డ్రిల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్