Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constitution Day: రాజ్యాంగాన్ని నిబద్ధతగా పాటిస్తున్నామా.. మనం ఎటువైపు వెళ్తున్నాం..

పార్లమెంట్ సెంట్రల్ హాల్‎లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి మోడీ నివాళులర్పించారు...

Constitution Day: రాజ్యాంగాన్ని నిబద్ధతగా పాటిస్తున్నామా.. మనం ఎటువైపు వెళ్తున్నాం..
Modi
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 26, 2021 | 11:53 AM

పార్లమెంట్ సెంట్రల్ హాల్‎లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి మోడీ నివాళులర్పించారు. 2008లో ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి వందలాది మంది అమాయక పౌరులను హతమార్చిన ఈరోజు 26/11 కూడా మనకు చాలా బాధాకరమైన రోజు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్, టీఎంసీతో సహా 12 పార్టీలు బహిష్కరించాయి.

“ఆ రోజు మరణించిన ప్రతి ఒక్కరికీ నేను నివాళులర్పిస్తాను. ఇతరులను రక్షించడానికి తమ ప్రాణాలను అర్పించిన మన అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం – ఈ రోజు మనం మన రాజ్యాంగం చెప్పినదంతా సమర్థిస్తున్నామా? రాజ్యాంగాన్ని మన గొప్ప నాయకులు, భారతదేశానికి స్వాతంత్ర్యం పొందిన వారు రచించారు. అయితే ఈరోజు మనం రాజ్యాంగంలోని ఒక పేజీని కూడా అనుసరిస్తున్నామా?. మనం రాజ్యాంగాన్ని అక్షరబద్ధంగా, స్ఫూర్తితో పాటిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఎటువైపు వెళ్తున్నామో, మన ప్రాధాన్యత ఏమిటి, దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.” అని మోడీ అన్నారు.

Read Also.. Share Market Today: బ్లాక్‌ ఫ్రైడే.. మార్కెట్లు భారీ పతనం.. మదుపరుల షాక్.. భయపడాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు..