AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూత్ర విసర్జన ఘటనలో నిందితుడి ఇల్లు కూల్చివేత.. ‘మా తప్పేముందంటూ అతడి కుటుంబం ఆవేదన’

ఈ అవమానకరమైన సంఘటన తరువాత ముఖ్యమంత్రి శివరాజ్ ఆదేశాల మేరకు.. అధికారులు నిందితుడు ప్రవేశ్ శుక్లా ఇంటిని బుల్డోజర్ తో కూల్చివేశారు. ఇంటిని ధ్వంసం చేసిన తర్వాత ప్రవేశ్ శుక్లా కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. నిందితుడు ప్రవేశ్ శుక్లా భార్య తన చిన్న పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి బయట గ్యాస్ సిలిండర్ పెట్టుకుని కూర్చున్నారు. తమని నిరాశ్రయులను  చేసి  తీరని అన్యాయం చేశారంటూ వాపోతున్నారు. 

మూత్ర విసర్జన ఘటనలో నిందితుడి ఇల్లు కూల్చివేత.. 'మా తప్పేముందంటూ అతడి కుటుంబం ఆవేదన'
Pravesh Shukla Wife
Surya Kala
| Edited By: |

Updated on: Jul 06, 2023 | 4:40 PM

Share

మూడు రోజులుగా మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లా మూత్ర వివాదాలతో వార్తల్లో నిలిచింది. వైరల్ వీడియోతో ప్రారంభమైన సంఘటనలో నిందితుడిని అరెస్టు చేశారు. మరోవైపు బాధితుడిని సీఎం శివరాజ్ కూడా సత్కరించారు. బాధితుడు దశమత్ రావత్‌ను తన ఇంటికి పిలిపించుకున్న సీఎం శివరాజ్.. బాధితుడి  పాదాలను కడిగి, కలిసి భోజనం చేశారు. అదే సమయంలో నిందితుడు ప్రవేశ్ శుక్లా కుటుంబం రెండు రోజులుగా ఆకలితో ఉందని పేర్కొంది.

ఈ అవమానకరమైన సంఘటన తరువాత ముఖ్యమంత్రి శివరాజ్ ఆదేశాల మేరకు.. అధికారులు నిందితుడు ప్రవేశ్ శుక్లా ఇంటిని బుల్డోజర్ తో కూల్చివేశారు. ఇంటిని ధ్వంసం చేసిన తర్వాత ప్రవేశ్ శుక్లా కుటుంబ సభ్యులు వీధి పాలయ్యారు. నిందితుడు ప్రవేశ్ శుక్లా భార్య తన చిన్న పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి బయట గ్యాస్ సిలిండర్ పెట్టుకుని కూర్చున్నారు. తమని నిరాశ్రయులను  చేసి  తీరని అన్యాయం చేశారంటూ వాపోతున్నారు.

మూత్ర విసర్జన ఘటనకు సంబంధించిన ఆ అవమానకరమైన వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన వెంటనే.. ప్రవేశ్‌కు ఉన్న రాజకీయ సంబంధం ప్రధానాంశం అయింది. అంతే కాదు ఇదే విషయంపై  కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తూ తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యమంత్రి శివరాజ్ కూడా తక్షణ చర్యలు తీసుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శిక్ష కూడా మరికొందరికి ఉదాహరణగా ఉండాలని సూచించారు. ఈ సూచనను అనుసరించి అధికారులు నిందితుడు ప్రవేశ్ శుక్లా ఇంటిని బుల్డోజర్ తో కూల్చివేశారు.

ఇవి కూడా చదవండి

ప్రవేశ్ శుక్లా చేసిన పనికి తాము శిక్ష అనుభవిస్తున్నాం అంటూ కుటుంబం విచారం వ్యక్తం చేసింది. బుల్‌డోజర్‌ తమ ఇంటిని కూల్చి వేస్తుంటే.. అత్త, తల్లి స్పృహ తప్పి పడిపోయారు. మరోవైపు, నిందితుడి భార్య పిల్లలతో కలిసి గ్యాస్ సిలిండర్‌తో ఇంటి బయట కూర్చొని తాము నిరాశ్రయులయ్యామని చెప్పింది. తాము తినడానికి ఏమీ లేదు. ఉండడానికి చోటు లేదు. రెండు రోజులుగా ఆకలితో అలమటిస్తున్న పిల్లలు బిస్కెట్లు, ప్యాకెట్లు తిని తమ పని తాము చేసుకుంటున్నారు.

మాకు ఎవరూ సహాయం చేయడం లేదని నిందితుడు ప్రవేశ్ భార్య చెబుతోంది. తన భర్త చేసిన తప్పు వల్ల కుటుంబమంతా శిక్ష అనుభవిస్తున్నామని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాకు చాలా అన్యాయం జరిగింది. బుల్‌డోజర్‌ తో కూల్చిన ఇల్లు తన భర్త పేరు మీద లేదని, తన అమ్మమ్మ పేరు మీద ఉందని, అయితే దానిని కూల్చివేశారని నిందితుడి భార్య కూడా చెబుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..