AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pralhad Joshi: మాయమాటలు చెప్పి సభా సమయాన్ని వృధా చేయకండి.. మణిపూర్ ఘటనపై చర్చకు సిద్ధంగా ఉన్నాం..

Parliament Monsoon session: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అర్థవంతమైన చర్చకు బీజేపీ సిద్ధమైంది. అయితే ప్రతిపక్షాలు మాయమాటలు చెప్పి సభా సమయాన్ని వృధా చేసుకోవడం మానుకోవాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభ్యర్థించారు.

Pralhad Joshi: మాయమాటలు చెప్పి సభా సమయాన్ని వృధా చేయకండి.. మణిపూర్ ఘటనపై చర్చకు సిద్ధంగా ఉన్నాం..
Pralhad Joshi
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jul 21, 2023 | 5:27 PM

Share

వర్షాకాల సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. రెండు రోజూ పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగింది. మణిపూర్‌ వ్యవహారం ఉభయ సభలను కుదేపిసింది. చర్చించాలని విపక్షం, చర్చకు సిద్ధమేనంటూ ప్రభుత్వం ఎవరి వాదనను వారు వినిపించడంతో తీవ్ర గందరగోళం మధ్య ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అయితే,  ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షరతు పెట్టి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న ప్రతిపక్షాలు ప్రజానుకూల సమస్యలపై చర్చించడం సరికాదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అసహనం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో స్పందిస్తూ.. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తొలి రోజు సెషన్‌లో కూడా ఇదే చెప్పాం. కానీ ప్రతిపక్షాలు మళ్లీ మళ్లీ కొత్త షరతులు పెట్టి సభను అడ్డుకుంటున్నాయని విచారం వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అర్థవంతమైన చర్చకు సిద్ధంగా ఉందన్నారు. అయితే విపక్షాలు అబద్ధాలు చెప్పి సభను చెడగొట్టకుండా సహకరించాలన్నారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.

ప్రతిపక్ష పార్టీల నేతలు నోటీసులివ్వడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రహ్లాద జోషి స్పందిస్తూ.. సభా నియమావళిలో నోటీసు ఇచ్చే అవకాశం లేదని, ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలన్నారు. లేనిపోని నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయడంలో జాప్యం చేయరాదని అభ్యర్థించారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.

ఈ వసంత సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చ జరగాల్సి ఉంది. ప్రజానుకూల సమస్యలపై చర్చ జరగాలి. అందువల్ల ప్రతిపక్ష నేతలు సభా కార్యక్రమాలను అడ్డుకోవడం మానేసి సజావుగా సాగేలా చూడాలని.. మణిపూర్ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం