AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: భారత అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం.. అవసరమైతే తప్ప అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా కరోనా వికృతరూపం ప్రదర్శిస్తున్న వేళ భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడేళ్లలోపు జైలు శిక్ష ప‌డే నేరాల విష‌యంలో నిందితుల‌ను అవ‌స‌ర‌మైతే తప్ప అరెస్ట్ చేయకూడదని స్పష్టం చేసింది.

Supreme Court: భారత అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం.. అవసరమైతే తప్ప అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు
Supreme Court
Balaraju Goud
|

Updated on: May 08, 2021 | 7:31 PM

Share

Supreme Court on prisons: దేశవ్యాప్తంగా కరోనా వికృతరూపం ప్రదర్శిస్తున్న వేళ భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడేళ్లలోపు జైలు శిక్ష ప‌డే నేరాల విష‌యంలో నిందితుల‌ను అవ‌స‌ర‌మైతే తప్ప అరెస్ట్ చేయకూడదని స్పష్టం చేసింది. ఖైదీలంద‌రికీ స‌రైన వైద్య స‌దుపాయాలు అందేలా చూడాలని అధికారుల‌ను ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. క‌రోనా బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న ఖైదీల‌ను గుర్తించి, వెంట‌నే రిలీజ్ చేసేలా చూడాల‌ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన అత్యున్నత క‌మిటీల‌కు సూచించింది. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా జైళ్లలో ర‌ద్దీని త‌గ్గించే ఉద్దేశంతో అత్యున్నత న్యాయ‌స్థానం ఈ ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఇప్పటికే పెరోల్‌పై బయటకు వచ్చిన ఖైదీలకు మ‌రో 90 రోజులు పొడిగించాల‌నీ ఆదేశించింది. గతేడాది మార్చి 23న క‌రోనా నేప‌థ్యంలోనే తాత్కాలిక బెయిలు ఖైదీలు, పెరోల్‌పై ఉన్న వాళ్లను, ఏడేళ్ల కంటే త‌క్కువ శిక్ష ప‌డే నేరాల్లో విచార‌ణ ఎదుర్కొంటున్న ఖైదీలను రిలీజ్ చేసే అంశాన్ని ప‌రిశీలించ‌డానికి క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జైళ్లలో క‌రోనా వ్యాప్తిని అదుపులో ఉంచ‌డానికి త‌ర‌చూ ఖైదీలు, జైలు అధికారుల‌కు టెస్టులు నిర్వహించాల‌ని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఖైదీల‌కు వైర‌స్ సోక‌కుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల‌ని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జైళ్లలో 4 ల‌క్షల‌కుపైగా ఖైదీలు ఉన్నారు. కొన్ని జైళ్లలో సామ‌ర్థ్యానికి మించి ఉన్నట్లు కూడా కోర్టు గుర్తించింది. భౌతిక దూరం పాటించకుంటే వైరస్ ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also… Corona India: భారత్ లో 3-4 వారాలపాటు లాక్ డౌన్ విధించాలి అంటున్న డాక్ట‌ర్ ఆంథోనీ ఫౌసీ.. ( వీడియో )