PM Modi: మార్చి 4 నుంచి తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన.. భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం

దేశంలో ఎన్నికలు సమీపిస్తు్న్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్‌ రాష్ట్రాలలో మార్చి 4-6 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఆదిలాబాద్‌లో మార్చి 4వ తేదీన ఉదయం 10:30 గంటలకు రూ.56,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన..

PM Modi: మార్చి 4 నుంచి తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన.. భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం
Pm Modi
Follow us

|

Updated on: Mar 03, 2024 | 10:38 PM

దేశంలో ఎన్నికలు సమీపిస్తు్న్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్‌ రాష్ట్రాలలో మార్చి 4-6 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఆదిలాబాద్‌లో మార్చి 4వ తేదీన ఉదయం 10:30 గంటలకు రూ.56,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు.

అలాగే హైదరాబాద్‌లోని పౌర విమానయాన పరిశోధన సంస్థ కేంద్రాన్ని మార్చి 5వ తేదీ ఉదయం 10 గంటలకు జాతికి అంకితం చేయనున్నారు. అదే రోజు సంగారెడ్డిలో రూ 6,800 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డిలో చేపట్టిన ప్రాజెక్టులు రోడ్డు, రైలు, పెట్రోలియం, సహజ వాయువు వంటి బహుళ కీలక రంగాలను కలిగి ఉన్నాయి. హైదరాబాద్‌లో దేశ పౌర విమానయాన పరిశోధనా సంస్థని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే ఘట్‌కేసర్ – లింగంపల్లి నుండి మౌలా అలీ – సనత్‌నగర్ ఎంఎంటీఎస్‌ రైలు సర్వీస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు సేవ హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగర ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన సబర్బన్ రైలు సేవను మొదటిసారిగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇక ఇక్కడి నుంచి ఒడిశాకు బయలుదేరి  మధ్యాహ్నం 3:30 గంటలకు జాజ్‌పూర్‌లోని చండీఖోలేలో రూ.19,600 కోట్లు విలువైన బహుళ కనెక్టివిటీ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.

కోల్‌కతాలో మార్చి 6వ తేదీన ఉదయం 10:15 గంటలకు 15,400 కోట్ల విలువైన బహుళ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత, మధ్యాహ్నం 3:30 గంటలకు దాదాపు రూ.కోటి విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే బీహార్‌లోని బెట్టియాలో 12,800 కోట్లు విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, ఆదిలాబాద్‌లో ప్రారంభించే అభివృద్ధి పనుల్లో 56,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన విద్యుత్, రైలు, రోడ్డు రంగానికి సంబంధించిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో ఎన్టీపీసీ 800 మెగావాట్ల (యూనిట్-2) తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేయనున్నారు. అల్ట్రా-సూపర్‌క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ తెలంగాణకు 85% విద్యుత్‌ను సరఫరా చేస్తుంది. అలాగే భారత్లోని ఎన్‌టీపీసీ అన్ని పవర్ స్టేషన్‌లలో దాదాపు 42% అత్యధిక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ప్రధాని షెడ్యూల్‌ వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!