AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India: పేదరికం నుంచి బయటపడుతున్న భారత్.. కారణమిదే

భారతదేశంగా మనకు చాలా కాలంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశం అనే ఇమేజ్ ఉంది. కరెన్సీ విలువల్లో మార్పులు,  ఆర్థిక, వైద్య, విద్య లాంటి ఇతర అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మనకున్న విస్తారమైన జనాభా పరిమాణం కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశం.

India: పేదరికం నుంచి బయటపడుతున్న భారత్.. కారణమిదే
Poor
Balu Jajala
|

Updated on: Mar 03, 2024 | 9:42 PM

Share

భారతదేశంగా మనకు చాలా కాలంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశం అనే ఇమేజ్ ఉంది. కరెన్సీ విలువల్లో మార్పులు,  ఆర్థిక, వైద్య, విద్య లాంటి ఇతర అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మనకున్న విస్తారమైన జనాభా పరిమాణం కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశం. అందుకే భారత్ కు మూడో ప్రపంచ దేశమనే ట్యాగ్ ఉంది. కానీ ఇదంతా గతం. ఏడాదికి ఏడాది చాలా మార్పులు జరుగుతున్నాయి. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే..  భారత్ నెమ్మదిగా పేదరికం నుంచి బయటపడుతోంది. కొన్ని దశాబ్దాల క్రితంతో పోలిస్తే పేదరికం శాతం భారీగా తగ్గింది. ఇది ప్రభుత్వం చెబుతున్నది కాదు కానీ ఒక అంతర్జాతీయ సంస్థ చెప్పింది.

ప్రపంచ పేదరిక పరిశీలనల ప్రకారం దేశంలో పేదలు 4 కోట్ల లోపు ఉన్నారు. భారతదేశ జనాభా పరిమాణాన్ని బట్టి చూస్తే, పేదరికం సంఖ్య చాలా తక్కువ. ఇది దేశానికి శుభవార్తగా పరిగణించవచ్చు. దేశంలో కేవలం 4 కోట్ల మంది పేదలు ఉన్నారని, ఇది కేవలం 3 శాతం మాత్రమేనని తెలిపింది. కొన్నేళ్లుగా పేదరికం పరిమాణం తగ్గుతూ వస్తోంది. గత రెండేళ్లతో పోలిస్తే పేదరికం తగ్గింది. 2023 లో సుమారు 4 కోట్ల మంది అత్యంత పేద ప్రజలు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. 2024తో పోలిస్తే ఈ శాతం కూడా తగ్గింది.

డివిజన్ విషయానికొస్తే వీరిలో 94 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాగా, మిగిలిన వారు పట్టణ ప్రాంతాలకు చెందినవారు. నివేదికలోని పారామీటర్ ను పరిశీలిస్తే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ (పీపీపీ)ని పరిగణనలోకి తీసుకున్నారు. రోజువారీ కొనుగోలు శక్తి 1.9 డాలర్లు (రూ.158) ఉన్నవారు 3 శాతం కంటే తక్కువ. పేదరికం తగ్గుముఖం పడుతోందని నివేదిక తెలిపింది. 2022తో పోలిస్తే 2023లో తగ్గగా, 2024లో మరింత తగ్గింది. ఇతర దేశాలతో పోలిస్తే అన్ని రంగాల్లో ఇండియా దూసుకుపోతూ పెట్టబడులను ఎంకరేజ్ చేస్తోంది. ప్రముఖ కంపెనీల ఏర్పాటుకు వసతులను సమకూరుస్తుండటంతో భారత్ అన్ని రకాలుగా ముందుకెళ్తోంది.