AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 సంస్థలపై ఫేక్ కేసులు పెట్టాలని ఢిల్లీ పోలీసులకు, సీబీఐకి ప్రధాని మోదీ ఆదేశం.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఫైర్

15 సంస్థలపై తప్పుడు (ఫేక్) కేసులు పెట్టాలని ఢిల్లీ పోలీసులకు, సీబీఐకి, ఈడీకి ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.

15 సంస్థలపై ఫేక్ కేసులు పెట్టాలని ఢిల్లీ పోలీసులకు, సీబీఐకి ప్రధాని మోదీ ఆదేశం.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఫైర్
Manish Sisodia
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 22, 2021 | 1:51 PM

Share

15 సంస్థలపై తప్పుడు (ఫేక్) కేసులు పెట్టాలని ఢిల్లీ పోలీసులకు, సీబీఐకి, ఈడీకి ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే లోగా ఫేక్ దాడులు నిర్వహించి తప్పుడు కేసులు బనాయించాలని అంటూ 15 సంస్థల జాబితాను కూడా ఆయన ఇచ్చారన్నారు. ఈ సంస్థల్లో ఆప్ పార్టీకి చెందినవే ఎక్కువగా ఉన్నాయన్నారు. త్వరలో ఎన్నికలు జరిగేలోగానే ఈ సంస్థలను నాశనం చేయాలనీ ఆయన సూచించారని సిసోడియా చెప్పారు. మోదీ బ్రహ్మాస్త్రం రాకేష్ ఆస్తానా అని, తనకెవరు అడ్డొచ్చినా ఖాతరు చేయకుండా మీరు అప్పగించిన పనిని పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలిసిందని సిసోడియా పేర్కొన్నారు. నిజాయితీ రాజకీయాలకు ఆప్ పెట్టింది పేరన్నారు. మీరు సీబీఐని, ఈడీని పంపినా తాము వాటిని ఆహ్వానిస్తాం..గతంలో ఈ సంస్థలు నా ఇంటిలోనూ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇల్లు, ఆఫీసుల్లోనూ ఇలాంటి దాడులు జరిగేలా చూశారు.. ఏం లభించింది అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు తన ఇంటి బెడ్ రూమ్ లో కూడా ప్రవేశించారన్నారు.

ఉత్తరాఖండ్, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా.. సిసోడియా వ్యాఖ్యలను ఖండించారు. డీటీసీ బస్ స్కామ్ , ఎక్సయిజు పాలసీ నిధులు, ఢిల్లీ జలమండలి కుంభకోణాల్లో మీ ప్రభుత్వం చిక్కుకుపోయిందని, అందుకే భయపడుతున్నారని ఆయన అన్నారు. మూడు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో మీ పార్టీ ఓడిపోతుందన్న భయంతో ఇలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని గుప్తా పేర్కొన్నారు. తప్పు చేయనివారికి భయమెందుకన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్ఘన్ పరిణామాలను చూసి గుణపాఠం నేర్చుకోండి.. కేంద్రానికి పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ చురక.. బీజేపీ ఖండన

Afghanistan Crisis: అమెరికా మిలటరీ విమానంలో ప్రసవించిన ఆఫ్గన్ మహిళ.. జర్మనీలో చికిత్స..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..