AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోదీ చెప్పిన కచ్చతీవు ద్వీపం సంచలన కథ ఏంటో తెలుసా..

Katchatheevu Island Story: అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానం చారిత్రక ప్రసంగాల్లో నమోదైంది. నిజానికి, అవిశ్వాస తీర్మానం సమయంలో ఏ ప్రధానమంత్రి సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డు ఇప్పుడు నరేంద్ర మోదీ పేరిట ఉంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు అంశాలను టచ్ చేశారు. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ, ఈరోజు పార్లమెంట్‌లో ప్రధాని మోదీ తన ప్రసంగంలో భారత్‌లో భాగమైన, ఇప్పుడు శ్రీలంకలో భాగమైన భూమిని ప్రస్తావించారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ద్వీపాన్ని శ్రీలంక ఏ యుద్ధంలోనూ గెలవలేదు, బలవంతంగా స్వాధీనం చేసుకోలేదు... మరి 1974లో ఈ ద్వీపాన్ని శ్రీలంకకు బహుమతిగా ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించారు.

PM Modi: ప్రధాని మోదీ చెప్పిన కచ్చతీవు ద్వీపం సంచలన కథ ఏంటో తెలుసా..
Katchatheevu Island
Sanjay Kasula
| Edited By: |

Updated on: Aug 11, 2023 | 8:50 PM

Share

పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. ఓటింగ్‌కు అవకాశం లేదు.. ప్రధాని ప్రసంగం సమయంలో విపక్షాలు వాకౌట్‌ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం సగం పూర్తయినా సభలో విపక్షాల బెంచీలు ఖాళీగా ఉన్నాయి. అయితే ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 133 నిమిషాల ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంటులోనే 2024 ఎన్నికల ఎజెండాను రూపొందించారు. మూడోసారి కూడా నరేంద్ర మోదీదేనని.. ఇది ప్రజల విశ్వాసమని ఆయన పేర్కొన్నారు. ప్రజల అవిశ్వాసం కేంద్ర ప్రభుత్వంపై కాదని, కాంగ్రెస్ దానితో సంబంధం ఉన్న పార్టీలపై ఉందని ప్రధాని విరుచుకుపడ్డారు.

అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత్‌లో భాగమైన ఆ ప్రదేశం ఇప్పుడు శ్రీలంకలో భాగమైన భూమిని ప్రస్తావించారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ద్వీపాన్ని శ్రీలంక ఏ యుద్ధంలోనూ గెలుకోలేదు. బలవంతంగా స్వాధీనం కూడా చేసుకోలేదు.. 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ ద్వీపాన్ని శ్రీలంకకు బహుమతిగా ఇచ్చింది. ఈ ద్వీపం చరిత్ర.. దానిని శ్రీలంకకు అందించిన కథను మనం తెలుసుకోవాలి అంటూ ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అయితే దానికి ముందు ఈరోజు పార్లమెంట్‌లో ప్రధాని మోదీ దీని గురించి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..

కచ్చతీవు ద్వీపం గురించి ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..

పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘బయటకు వెళ్లిన వారిని అడగండి, ఈ కచ్చతీవు ద్వీపం ఏంటి ? మరి ఈ కచ్చతీవు ఎక్కడుంది..? వాళ్లను అడగండి… ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇంకా ఈ డీఎంకే వాళ్ళు, వాళ్ల ప్రభుత్వం, వాళ్ల ముఖ్యమంత్రులు కచ్చతీవు ద్వీపాన్ని వెనక్కి తీసుకురావాలని మోదీ జీని కోరుతూ నాకు లేఖలు రాస్తున్నారు. ఇదేనా కచ్చతీవు? ఎవరు చేశారు.. శ్రీలంక కంటే ముందు తమిళనాడు ఆవల ఉన్న దీవిని వేరే దేశానికి ఎవరు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఈ భారత మాత అక్కడ కాదా? అది మా భారతిలో భాగం కాదా..? మీరు దీన్ని కూడా ప్రశ్నించాలంటూ ఇండియా కూటమిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ సమయంలో ఎవరున్నారు.. ఇది శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వంలో జరిగింది. భారతమాతను విభజించడమే కాంగ్రెస్ చరిత్ర అంటూ మండిపడ్డారు.

ఇంతకీ ఈ దీవి కథ ఏంటంటే..

వాస్తవానికి, హిందూ మహాసముద్రంలో భారతదేశం దక్షిణ చివర, శ్రీలంక మధ్య ఒక ద్వీపం ఉంది. దానిపై నేటికీ ఎవరూ నివసించరు. అయితే ఈ ద్వీపం ఎప్పుడూ భారత్‌, శ్రీలంకల మధ్య వివాదానికి కారణమవుతోంది. 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం 17వ శతాబ్దంలో మధురై రాజా రామ్‌నాడ్ జమీందారీ ఆధ్వర్యంలో ఉండేది. కానీ భారతదేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతున్న సమయంలో ఈ ద్వీపం మద్రాసు ప్రెసిడెన్సీ ఆధీనంలోకి వచ్చింది. అంటే ఇది బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. అదే సమయంలో, 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు.. ప్రభుత్వ పత్రాలలో భారతదేశం భాగమని వివరించబడింది. అయితే, వివిధ సందర్భాల్లో కూడా శ్రీలంక దానిపై తన హక్కును చాటుకుంటూనే ఉంది.

ఈ ద్వీపాన్ని ప్రధానంగా రెండు దేశాల మత్స్యకారులు ఉపయోగించారు. అయితే సరిహద్దు ఉల్లంఘనలకు సంబంధించి భారతదేశం, శ్రీలంక మధ్య ఎప్పుడు ఉద్రిక్తత కొనసాగేది. ఆ తర్వాత 1974లో దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య సమావేశం జరిగింది. ఇంతలో, రెండు ముఖ్యమైన సమావేశాలు జరిగాయి. ఒకటి జూన్ 26న కొలంబోలో,  మరొకటి జూన్ 28న ఢిల్లీలో. ఈ రెండు సమావేశాల్లోనూ కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇవ్వాలని నిర్ణయించారు అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం. దీనితో పాటు, ఒప్పందంలో కొన్ని షరతులు పెట్టారు. భారతీయ మత్స్యకారులు తమ వలలను ఆరబెట్టడానికి ఈ ద్వీపానికి వెళ్లగలరు. దీనితో పాటు, ఈ ద్వీపంలో నిర్మించిన చర్చిని వీసా లేకుండా భారతీయ ప్రజలు సందర్శించవచ్చు. అయితే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగానే అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది అంతులేని కథ..

కథ ఇక్కడితో ముగిసిపోలేదు, 1976లో భారతదేశం, శ్రీలంక మధ్య సముద్ర సరిహద్దుకు సంబంధించి మరొక ఒప్పందం తెరమీదికి వచ్చింది. ఈ ఒప్పందంలో, భారత మత్స్యకారులు, ఫిషింగ్ ఓడలు శ్రీలంక స్పెషల్ ఫైనాన్స్ జోన్‌లోకి ప్రవేశించరాదని పేర్కొంది. ఈ ఒప్పందం కచ్చతీవు ద్వీప వివాదానికి ఆజ్యం పోసింది. దీంతో తమిళనాడు మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే 1991లో ఎమర్జెన్సీ తర్వాత కచ్చతీవు ద్వీపాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతూ తమిళనాడు శాసనసభలో తీర్మానం చేశారు.

చాలా కాలం తరువాత, 2008లో ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని లేవనెత్తారు. రాజ్యాంగ సవరణ లేకుండా భారత ప్రభుత్వం దేశంలోని భూమిని మరే ఇతర దేశానికీ ఇవ్వదని వాదించారు. 2011లో జయలలిత సీఎం అయ్యాక అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. 2014 సంవత్సరంలో ఈ అంశంపై వాదిస్తూ ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ.. ఒప్పందం ప్రకారం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చారని.. ఇప్పుడు అది అంతర్జాతీయ సరిహద్దులో భాగమని తెలిపారు. ఇప్పుడు భారత్ దానిని ఎలా తిరిగి పొందగలదు? మనం కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే.. ఓ యుద్ధం చేయవలసి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us