AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ ప్రశంసలు.. ఉబ్బితబ్బిబ్బయిన రిక్షా పుల్లర్

వారణాసి సమీపంలోని డోమ్రీ గ్రామానికి చెందిన రిక్షాపుల్లర్ కేవత్ ఆనందానికి హద్దులు లేవు. స్వయంగా ప్రధాని మోదీని కలిసిన ఘటన   ఒకవైపు, ఆయననుంచి తనకు అందిన ప్రశంసలు మరో వైపు ఆ పేద రిక్షాకార్మికుడిని కొద్దిసేపు అత్యంత సంతోషంలో ముంచెత్తాయి. తన కుమార్తె పెళ్ళికి మోదీ నుంచి అందిన దీవెన లేఖ ఇప్పటికే కేవత్ ని ఆనంద పరవశుడ్ని చేయగా.. తనను కలుసుకోవాలని  ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఓ ఆహ్వానం అతనికి అందింది. సోమవారం మోదీ […]

మోదీ ప్రశంసలు.. ఉబ్బితబ్బిబ్బయిన రిక్షా పుల్లర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 18, 2020 | 10:55 AM

Share

వారణాసి సమీపంలోని డోమ్రీ గ్రామానికి చెందిన రిక్షాపుల్లర్ కేవత్ ఆనందానికి హద్దులు లేవు. స్వయంగా ప్రధాని మోదీని కలిసిన ఘటన   ఒకవైపు, ఆయననుంచి తనకు అందిన ప్రశంసలు మరో వైపు ఆ పేద రిక్షాకార్మికుడిని కొద్దిసేపు అత్యంత సంతోషంలో ముంచెత్తాయి. తన కుమార్తె పెళ్ళికి మోదీ నుంచి అందిన దీవెన లేఖ ఇప్పటికే కేవత్ ని ఆనంద పరవశుడ్ని చేయగా.. తనను కలుసుకోవాలని  ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఓ ఆహ్వానం అతనికి అందింది. సోమవారం మోదీ వారణాసిని  సందర్శించిన సందర్భంగా కేవత్ ఆయనను కలిశాడు.. స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా గంగానది శుద్దికి కేవత్ తన గ్రామంలో ఆ నది తీరాన్ని కొంతభాగం శ్రధ్దతో క్లీన్ చేశాడని తెలిసి మోదీ అతడ్ని అభినందించారు. అతని కుటుంబ బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అతని ఫ్యామిలీకి ఆర్ధిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 12 న కేవత్ కూతురు పెళ్లి జరిగింది. ఆ పెళ్ళికి హాజరు కావాలని కోరుతూ కేవత్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి కార్యాలయంలో శుభలేఖ ఇఛ్చాడు. దాన్ని  చూసిన మోదీ ఆశీస్సులతో కూడిన లేఖను పంపిన సంగతి తెలిసిందే.