AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50 States in India: 2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

జనాభా పెరగడంతో దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు అవసరమని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక జనాభా గత 60 ఏళ్లలో రెండు కోట్ల నుంచి 6.5 కోట్లకు పెరిగిందని వివరించారు.

50 States in India: 2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
India Map
Janardhan Veluru
|

Updated on: Jun 24, 2022 | 12:20 PM

Share

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో రాష్ట్రాల సంఖ్య 50కి చేరనుందంటూ కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా కర్ణాటక రెండు రాష్ట్రాలు కానుందని.. ఆ మేరకు తనకు స్పష్టమైన సమాచారమున్నట్లు కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి మీడియాకు తెలిపారు. జనాభా పెరగడంతో చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో మేలు జరుగుతుందని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కొత్తగా నార్త్ కర్ణాటక ఏర్పాటు కానుందని ఆయన తెలిపారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

జనాభా పెరగడంతో దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేయాల్సిన అవసరముందని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక జనాభా గత 60 ఏళ్లలో రెండు కోట్ల నుంచి 6.5 కోట్లకు పెరిగిందని వివరించారు. భవిష్యత్తులో తప్పనిసరిగా నార్త్ కర్ణాటక కూడా కొత్త రాష్ట్రంగా ఏర్పడుతుందని, అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కర్ణాటక రెండు రాష్ట్రాలైతే వచ్చే నష్టమేమీ లేదన్న ఆయన.. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కన్నడీకులు కలిసిమెలిసి ఉంటారని అన్నారు. కర్ణాటక రెండు రాష్ట్రాలు, ఉత్తర ప్రదేశ్ నాలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర మూడు రాష్ట్రాలు..ఇలా మరిన్ని రాష్ట్రాలు ఏర్పాటు కానున్నాయని ఆయన వెల్లడించారు.

మంత్రి కత్తి వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.. నార్త్ కర్ణాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టంచేశారు. నార్త్ కర్ణాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఉమేశ్ కత్తి మాట్లాడటం ఇదేమీ కొత్త కాదన్నారు. చాలా ఏళ్లుగా ఆయన ఈ విషయంపై మాట్లాడుతున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి

నార్త్ కర్ణాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికి 100 సార్లు మంత్రి ఉమేశ్ కత్తి మాట్లాడారని ఆ రాష్ట్ర మరో మంత్రి ఆర్ అశోక పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అయితే కర్ణాటక ఒకటిగానే ఉంటుందని అన్నారు. ఎందరో కన్నడీకులు పోరాటాలు చేసి సమైక్య కర్ణాటక రాష్ట్రం సాధించారని అన్నారు. ఈ అంశంపై సీఎం బొమ్మై.. మంత్రి కత్తితో మాట్లాడుతారని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ