AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాక్సిన్ వృధాను తగ్గించారు, కేరళ ప్రభుత్వానికి ప్రధాని మోదీ ప్రశంస, ఇతర రాష్ట్రాలు పాటించాలని సూచన

ఈ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ వృధా కాకుండా తగ్గించినందుకు కేరళ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ అభినందించారు.

వ్యాక్సిన్ వృధాను తగ్గించారు, కేరళ ప్రభుత్వానికి ప్రధాని మోదీ ప్రశంస, ఇతర రాష్ట్రాలు పాటించాలని సూచన
Pm Modi Hails Kerala Reducing Vaccine Wastage
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 05, 2021 | 7:06 PM

Share

ఈ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ వృధా కాకుండా తగ్గించినందుకు కేరళ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ అభినందించారు. కోవిడ్ పై పోరులో ఇలాగే అన్ని రాష్టాలూ సహకరించాలన్నారు. మీ రాష్ట్ర నర్సులు, హెల్త్ కేర్ వర్కర్లు వ్యాక్సిన్ వేస్టేజీని తగ్గించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. తమ రాష్ట్రంలో వ్యాక్సిన్ వృథాకు సంబంధించి డేటాను విజయన్ ప్రధానంగా ప్రస్తావించారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి 73,38,806 డోసుల వ్యాక్సిన్ అందిందని, తాము 74,26,164 డోసులను అందజేశామని ఆయన పేర్కొన్నారు. అదనంగా లభ్యమైన డోసులను కూడా మా నర్సులు, హెల్త్ కేర్ వర్కర్లు వినియోగించారని ఆయన వెల్లడించారు. ఇందుకు వారిని ఎంతగానో అభినందిస్తున్నానన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఇప్పటివరకు 17.2 కోట్ల డోసుల టీకామందును ఉచితంగా ప్రొవైడ్ చేసిందనిఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వచ్చే 3 రోజుల్లో 36 లక్షలకు పైగా డోసుల టీకామందును వీటికి పంపుతామని తెలిపింది. కాగా వ్యాక్సిన్ ని వృధా చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని ఇటీవల ఓ ఆర్టీఐ యాక్టివిస్టుకు అందిన సమాచారంలో తెలిసింది. ఈ రాష్ట్రం 8.83 శాతం వేస్టేజీతో మొదటి స్థానంలో ఉండగా అస్సాం (7.7 శాతం), మణిపూర్ (7.44), హర్యానా 5.72 శాతం తో ఉన్నట్టు వెల్లడైందిఇదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యూపీ రాష్ట్రాలు కూడా టీకామందును వృధా చేశాయని అందువల్ల ఈ రాష్ట్రాల అధికారులు పరిస్థితిని సమీక్షించాలని ప్రధాని మోదీ వీటికి రాసిన లేఖల్లో పేర్కొన్నారు. ఇలా వ్యాక్సిన్ ని వృధా చేసే రాష్ట్రాలకు దీని కోటాను తగ్గించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యాక్సిన్ డోసుల్లో చాలాభాగం ప్రైవేటు ఆసుపత్రులకు, అర్హత లేని వ్యక్తులకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు కేంద్రం దృష్టికి వచ్చాయి.పరిస్థితి ఇలాగే కొనసాగితే మీకు పంపే కోటాలో కోత ఉండవచ్చునని కేంద్రం పరోక్షంగా సూచించినట్టు తెలిసింది.ప్రస్తుత పరిస్థితుల్లో టీకామందు వృదాను సహించలేమని కూడా కేంద్రం పేర్కొందట.

మరిన్ని ఇక్కడ చూడండి: అసలే కరోనా టైమ్.. ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినడం చాలా అవసరం.! ఒక్కసారి ట్రై చేయండి.!!

Pooja Hegde: కోవిడ్‏ను జయించిన పూజా హెగ్డే… స్టుపిడ్‌ కరోనాను తన్నేశా అంటూ ట్వీట్..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!