AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: త్వరలోనే 6G కూడా వచ్చేస్తుంది..! ప్రధాని మోదీ కీలక ప్రటకన

భారతదేశం 2025 నాటికి తన మొదటి స్వదేశీ సెమీకండక్టర్ చిప్‌ను విడుదల చేయనుందని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. ఇది 'మేడ్ ఇన్ ఇండియా' కింద 6G నెట్‌వర్క్ అభివృద్ధికి కూడా వేగం చేస్తుంది. అంతేకాకుండా, 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేసే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించారు.

PM Modi: త్వరలోనే 6G కూడా వచ్చేస్తుంది..! ప్రధాని మోదీ కీలక ప్రటకన
Pm Modi 6g
SN Pasha
|

Updated on: Aug 24, 2025 | 7:03 AM

Share

శనివారం ది ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. ఇండియా 2025 చివరి నాటికి దేశీయంగా తయారు చేసిన మొదటి సెమీకండక్టర్ చిప్‌ను విడుదల చేయనుందని, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా 6G నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో దేశం వేగంగా ముందుకు వెళ్తోందని ఆయన వెల్లడించారు. గత ఐదు నుండి ఆరు దశాబ్దాలుగా భారతదేశం సెమీకండక్టర్ రంగంలో అవకాశాలను కోల్పోయిందని మోడీ అన్నారు. “భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ 50-60 సంవత్సరాల క్రితమే ప్రారంభమై ఉండేదని మనందరికీ తెలుసు, కానీ భారతదేశం దానిని కోల్పోయింది. నేడు మనం ఈ పరిస్థితిని మార్చాం. భారతదేశంలో సెమీకండక్టర్ సంబంధిత కర్మాగారాలు రావడం ప్రారంభించాయి. ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి మేడ్-ఇన్-ఇండియా చిప్ మార్కెట్లోకి వస్తుంది” అని ప్రధాని పేర్కొన్నారు. దేశ సాంకేతిక రంగ వేగాన్ని ప్రస్తావిస్తూ.. మేడ్ ఇన్ ఇండియా 6Gపై మేం వేగంగా పని చేస్తున్నాం అని ప్రధాని వెల్లడించారు.

100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలు

ఇండియా 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను (EVలు) ఎగుమతి చేయాలనే ప్రణాళికలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. “భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయబోతోంది. దీనికి సంబంధించిన చాలా పెద్ద కార్యక్రమం కూడా ఆగస్టు 26న ప్రారంభం కానుంది.” అని ఆయన పేర్కొన్నారు. “సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాన్ని అనుసరించే భారతదేశం నేడు ప్రపంచాన్ని నెమ్మదిగా వృద్ధి రేటు నుండి బయటపడేయగల స్థితిలో ఉంది” అని మోదీ అన్నారు.

భారతదేశం త్వరలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ప్రపంచ వృద్ధికి 20 శాతం దోహదపడుతుందని ఆయన అంచనా వేశారు. షిప్పింగ్, పోర్టులు, క్రీడలకు సంబంధించిన పురాతన చట్టాలను – విస్తృత సంస్కరణలు భర్తీ చేశాయని, పోర్టు ఆధారిత అభివృద్ధిని పెంచడానికి, నీలి ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి, కొత్త జాతీయ క్రీడా విధానం ద్వారా బలమైన క్రీడా పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి రూపొందించిన ఆధునిక చట్రాలతో దీనిని రూపొందించామని ఆయన అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇటీవల జరిగిన శాసనసభ అంతరాయాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. “ప్రతిపక్షాలు సృష్టించిన అనేక అంతరాయాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో సంస్కరణలలో నిమగ్నమై ఉంది” అని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి