AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోర్డర్ల వద్ద రోడ్ల నిర్మాణాలు.. పార్లమెంట్ కమిటీ సమీక్ష

తూర్పు లద్దాఖ్ లో భారత-చైనా దళాల మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. వాస్తవాధీనరేఖ వద్ద రోడ్ల నిర్మాణం మీద సమీక్షించాలని పార్లమెంట్.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిర్ణయించింది. అలాగే ఎత్తయిన కొండ ప్రాంతాల్లో..

బోర్డర్ల వద్ద రోడ్ల నిర్మాణాలు.. పార్లమెంట్ కమిటీ సమీక్ష
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 11, 2020 | 11:56 AM

Share

తూర్పు లద్దాఖ్ లో భారత-చైనా దళాల మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. వాస్తవాధీనరేఖ వద్ద రోడ్ల నిర్మాణం మీద సమీక్షించాలని పార్లమెంట్.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిర్ణయించింది. అలాగే ఎత్తయిన కొండ ప్రాంతాల్లో విధి నిర్వహణలో  ఉండే  సాయుధ జవాన్లకు మరింత రక్షణనివ్వగల దుస్తుల సేకరణపై కూడా ఈ కమిటీ చర్చించింది. లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశానికి మొత్తం 22 మంది సభ్యులకు గాను 17 మంది హాజరయ్యారు.  కమిటీలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పానెల్ లో సీనియర్ బీజేపీ నేత భూపేందర్ యాదవ్ సహా ఈ పార్టీ సభ్యులు ఎక్కువమంది ఉన్నారు. పీఎం కేర్స్ ఫండ్ కి అందుతున్న విరాళాలపై సమావేశం చర్చించాలన్న చౌదరి సూచనను భూపేందర్ యాదవ్ తోసిపుచ్చారు.  ఈ అంశాన్ని చర్చించేందుకు పార్లమెంట్ ఆమోదం లేదని, అందువల్ల దీన్ని చర్చకు చేపట్టజాలమని ఆయన అన్నారు. యాదవ్ తో బీజేడీ, జేడీ-యు సభ్యులు ఏకీభవించారు. ‘ముఖ్యంగా భారత-చైనా బోర్డర్ల వద్ద రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ఆడిట్ పై 2017 నాటి కాగ్ నివేదికలోని అంశాలను కూడా పరిశీలించాలని ఈ పానెల్ నిర్ణయించింది. తాజాగా ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారుతున్న నేపథ్యంలో పార్లమెంట్ కమిటీ.. ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యత నివ్వడం విశేషం.