AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP vs Congress: ఒకవైపు తిరంగా.. మరోవైపు జైహింద్‌.. సైనికులకు మద్దతుగా పోటాపోటీ ర్యాలీలు

ఆపరేషన్‌ సింధూర్‌ చుట్టూ పొలిటికల్‌ మైలేజ్ హైడ్రామా జరుగుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత 100మంది టెర్రరిస్టుల్ని మట్టుబెట్టి.. పాకిస్తాన్‌కి గుణపాఠం నేర్పామని.. ఇది ఎన్డీఏ ప్రభుత్వ ఘనత అన్నట్టుగా బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటుంటే.. అసలెందుకు ట్రంప్‌ జోక్యం చేసుకున్నాడో చెప్పాలంటూ ప్రజల్లోకి వెళ్తోంది కాంగ్రెస్‌..

BJP vs Congress: ఒకవైపు తిరంగా.. మరోవైపు జైహింద్‌.. సైనికులకు మద్దతుగా పోటాపోటీ ర్యాలీలు
Bjp Vs Congress
Shaik Madar Saheb
|

Updated on: May 20, 2025 | 8:59 AM

Share

ఆపరేషన్ సింధూర్ సూపర్‌ సక్సెస్‌ తర్వాత సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్రలకు శ్రీకారం చుట్టింది బీజేపీ. ఇప్పటికే దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఇండియన్‌ ఆర్మీకి మద్దతు పలుకుతోంది. అయితే, బీజేపీకి పోటీగా జైహింద్‌ ర్యాలీలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్‌. ఆపరేషన్‌ సింధూర్‌, కాల్పుల విరమణ ఒప్పందంపై పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చాలని డిమాండ్‌ చేస్తోన్న కాంగ్రెస్‌.. జైహింద్‌ పేరిట సైనికులకు సంఘీభావం తెలపాలని నిర్ణయించింది.

ఆపరేషన్‌ సింధూర్‌ను బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడుతోంది కాంగ్రెస్‌. ముఖ్యంగా భారత్‌-పాకిస్తాన్‌ కాల్పుల వివరణపై ట్రంప్‌ ప్రకటన తర్వాత ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని నిరసిస్తూ ర్యాలీలు చేపడతున్నట్టు వెల్లడించింది. అంతేకాదు, దేశానికి చెందిన సైనిక సత్తాను తమ ఘనతగా బీజేపీ ప్రమోట్‌ చేసుకుంటోందని మండిపడుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత రెండుసార్లు అఖిలపక్ష భేటీ జరిగితే ఒక్కసారి కూడా మోదీ రాలేదని, దీనిపైనా జైహింద్‌ ర్యాలీల్లో ప్రశ్నిస్తామంటోంది కాంగ్రెస్‌. ఆపరేషన్‌ సింధూర్‌కి ముందు-తర్వాత కూడా కేంద్రానికి ఖర్గే, రాహుల్‌ మద్దతు ప్రకటించినా.. బీజేపీ మాత్రం పొలిటికల్‌ మైలేజ్‌ కోసం ప్రయత్నించడమేంటని నిలదీస్తోంది. ఇప్పటికైనా ఆపరేషన్‌ సింధూర్‌పై రాజకీయం చేయడం బీజేపీ ఆపాలని డిమాండ్‌ చేస్తోంది.

ఒకవైపు సైనికులకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ.. మరోవైపు ట్రంప్‌ ప్రకటన తర్వాత మోదీ మౌనాన్ని ప్రశ్నించడమే తమ ర్యాలీల లక్ష్యమంటోంది కాంగ్రెస్‌. కేంద్రం నుంచి సమాధానం వచ్చేవరకు జైహింద్‌ ర్యాలీలు చేస్తామంటోంది. అలాగే.. పహల్గామ్‌ ఉగ్రదాడి, ఆపరేషన్‌ సింధూర్‌, కాల్పుల విరమణపై చర్చిద్దామంటే.. ఎందుకు పార్లమెంట్‌ను సమావేశపర్చడం లేదని అడుగుతోంది కాంగ్రెస్‌.

మొత్తానికి, ఆపరేషన్‌ సింధూర్‌ చుట్టూ పొలిటికల్‌ మైలేజ్ హైడ్రామా జరుగుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత 100మంది టెర్రరిస్టుల్ని మట్టుబెట్టి.. పాకిస్తాన్‌కి గుణపాఠం నేర్పామని.. ఇది ఎన్డీఏ ప్రభుత్వ ఘనత అన్నట్టుగా బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటుంటే.. అసలెందుకు ట్రంప్‌ జోక్యం చేసుకున్నాడో చెప్పాలంటూ ప్రజల్లోకి వెళ్తోంది కాంగ్రెస్‌..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..