AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది సజీవ దహనం..

దేశరాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కిరారీ ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాంలో సోమవారం తెల్లవారుజామున 1.00 గంటల ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనం కాగా.. మరో 13మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఏడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక సంజయ్ గాంధీ మెమోరియల్‌ ఆస్పత్రికి తరలించి.. […]

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది సజీవ దహనం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 23, 2019 | 7:47 AM

Share

దేశరాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కిరారీ ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాంలో సోమవారం తెల్లవారుజామున 1.00 గంటల ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనం కాగా.. మరో 13మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఏడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక సంజయ్ గాంధీ మెమోరియల్‌ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు పమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా, గత కొద్ది రోజుల క్రితమే.. అనాజ్ మండి ప్రాంతంలో కూడా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.