AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIA Raid: ఉగ్ర జాడలపై NIA స్పెషల్‌ ఫోకస్‌.. దేశ వ్యాప్తంగా 50 చోట్ల ఏకకాలంలో దాడులు

దేశ వ్యాప్తంగా 60 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. NIA యొక్క ఈ చర్య గ్యాంగ్‌స్టర్ల స్థావరాలపై జరుగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం..

NIA Raid: ఉగ్ర జాడలపై NIA స్పెషల్‌ ఫోకస్‌.. దేశ వ్యాప్తంగా 50 చోట్ల ఏకకాలంలో దాడులు
Nia
Sanjay Kasula
|

Updated on: Sep 12, 2022 | 11:19 AM

Share

ఉగ్ర జాడలపై NIA స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. దేశ వ్యాప్తంగా 60 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. NIA యొక్క ఈ చర్య గ్యాంగ్‌స్టర్ల స్థావరాలపై జరుగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా చాలా చోట్ల NIA దాడులు కొనసాగుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ల స్థావరాలపై ముఖ్యంగా టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి, ఎన్ఐఏ అధికారులు ISI, ఖలిస్తానీ వేర్పాటు వాాదులను టర్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు పట్టుబడినవారంతా ఖలిస్తాన్ వేర్పాటువాదులగా గుర్తించారు. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసును ఉగ్రవాద కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ కేసులో గ్యాంగ్‌స్టర్లు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐల సంబంధం బయటపడిందని పంజాబ్ డీజీపీ వెల్లడించారు. వాస్తవానికి, లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌తో సహా సందీప్ అలియాస్ కాలా జాతేడి, ఉగ్రవాద సంబంధాలు బయటపడిన తర్వాతే ఈ దాడులు జరుగుతుండటం ఇప్పుడు ప్రాధాన్యత నెలకొంది. 

23 మంది అరెస్ట్

గత కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‏కు (Salman Khan) హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖలు వచ్చిన సంగతి తెలిసిందే. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను హత్య చేసిన నిందితులు సల్మాన్‏ను చంపేందుకు ముంబాయి రెక్కీ నిర్వహించినట్లుగా పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సూచనల మేరకే సల్మాన్ హత్యకు రెక్కీ జరిగినట్లుగా ఆదివారం వెల్లడించారు. ఈ క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు బెంగాల్ లోని ఇండో, నేపాల్ సరిహద్దు నుంచి నేపాల్ కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు.. సెంట్రెల్ ఏజెన్సీలతోపాటు ఏజీటీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ప్రాథమిక విచారణలో సల్మాన్ ఖాన్‌ను కూడా టార్గెట్ చేయాలని లారెన్స్ బిష్ణోయ్ కపిల్ పండిట్‌ను కోరినట్లు డీజీపీ తెలిపారు.

ముంబైలో రేకి చేశా..

తాను, తన ఇద్దరు సహచరులు రేకి చేయడానికి ముంబై వెళ్లినట్లు కపిల్ పోలీసులకు తెలిపాడు. ఈ హత్య కేసులో ఉన్న గ్యాంగ్‌స్టర్లకు ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయని డీజీపీ వెల్లడించారు. అదే సమయంలో, దీని తరువాత, NIA చర్యలు చేపట్టింది. గ్యాంగ్‌స్టర్ల స్థలాలపై దాడులు చేసింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం