మయన్మార్ లో మళ్ళీ నిరసన జ్వాలలు, సైనికుల కాల్పుల్లో 60 మందికి పైగా మృతి

మయన్మార్ లో శనివారం జరిగిన హింసాకాండలో 60 మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. యాంగాన్, మండలే,  ఇతర టౌన్లు, నగరాల్లో భారీ సంఖ్యలో ఆందోళనకు దిగినవారిపై సైనికులు, పోలీసులు కాల్పులు జరిపారు.

మయన్మార్ లో మళ్ళీ నిరసన జ్వాలలు, సైనికుల కాల్పుల్లో 60 మందికి పైగా మృతి
Myanmar Security Forces Shot Dead More Than 60 Protesters
Follow us

| Edited By: Phani CH

Updated on: Mar 27, 2021 | 9:03 PM

మయన్మార్ లో శనివారం జరిగిన హింసాకాండలో 60 మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. యాంగాన్, మండలే,  ఇతర టౌన్లు, నగరాల్లో భారీ సంఖ్యలో ఆందోళనకు దిగినవారిపై సైనికులు, పోలీసులు కాల్పులు జరిపారు. ఓ బాలుడితో బాటు ఈ హింసలో 60 మందికి పైగా మృతి చెందారని, వందలమంది గాయపడ్డారని, మయన్మార్ చరిత్రలో ఇదొక చీకటి రోజని విదేశీ పత్రికలు పేర్కొన్నాయి. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చ్చునని తెలిపాయి. అనధికారిక వార్తల  ప్రకారం 90 మంది మృతి చెందినట్టు భావిస్తున్నారు.    ‘బ్లడిఎస్ట్ డే, డే ఆఫ్ షేమ్’ అంటూ ఈ ఘటనను విదేశీ పత్రికలు అభివర్ణించాయి .. . మృతులు, గాయపడినవారితో అనేక వీధులు రక్తమోడుతూ కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దేశంలో సైనిక  ప్రభుత్వం గద్దె దిగాలని, ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని వెంటనే  విడుదల చేయాలనీ ఆందోళనకారులు కోరుతున్నారు. ఇప్పటివరకు జరిగిన హింసలో 400 మంది మరణించారని తెలుస్తోంది.  నిరసనకారులను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని సైనిక ప్రభుత్వం తమ సోల్జర్లకు, పోలీసులకు ఆదేశాలిచ్చింది. వారిని కాల్చి చంపవచ్చ్చునని పేర్కొంది. అటు నిరసనకారులు కూడా వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి జటిలమైంది. వారు కృత్రిమ ఎయిర్ గన్స్, ను , చివరకు విల్లంబులను కూడా వాడుతున్నారు.

కాగా-ఇళ్లలోని వారిని కూడా సైన్యం వదలడంలేదని, మహిళలు, పిల్లలని కూడా చూడకుండా కాల్పులు జరుపుతున్నారని వివిధ కుటుంబాలు విలపిస్తున్నాయి.   మయన్మార్ నుంచి చివరకు తమ పై అధికారుల ఆదేశాలను నిరాకరించి పలువురు పోలీసులు ఇండియాకు దొంగచాటుగా పారిపోయి వస్తున్నారు. మిజోరం చేరిన వీరిని తాత్కాలిక శరణార్ధులుగా భావిస్తున్నారు. అటు అమెరికా కూడా వీరికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తామని అంటోంది.

మరిన్ని ఇక్కడ చదవండి:Government officer Bribery : ఇదీ.. కొందరి ప్రభుత్వ అధికారుల పనితనం, పుష్కలంగా జీతాలున్నా.. కోట్లలో లంచం సొమ్ము కూడబెట్టకుంటున్న వైనం

Telangana: తెలంగాణలో భారీగా అదనపు కలెక్టర్ల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..