AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Day: ప్రేయర్స్ ఆపేస్తారా? లేదా?.. స్కూల్ యాజమాన్యానికి బెదిరింపులు.. వైరల్ అవుతున్న వీడియో..

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా స్కూ్ల్లో విద్యార్థులు.. ప్రార్థనలు చేయడం, వివిధ కాంపిటేషన్లలో పాల్గొనడం..

Republic Day: ప్రేయర్స్ ఆపేస్తారా? లేదా?.. స్కూల్ యాజమాన్యానికి బెదిరింపులు.. వైరల్ అవుతున్న వీడియో..
Threates
Shiva Prajapati
|

Updated on: Jan 27, 2023 | 8:01 AM

Share

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా స్కూ్ల్లో విద్యార్థులు.. ప్రార్థనలు చేయడం, వివిధ కాంపిటేషన్లలో పాల్గొనడం, క్విజ్, న్యూస్ రీడింగ్‌లో కూడా పాల్గొంటుంటారు. పాఠ్యేతర కార్యక్రమాలను ప్రోత్సహించడానికి స్కూల్ యాజమాన్యం ఈ కార్యక్రమాలు చేపడుతాయి.

అయితు, గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ప్రార్థనలను నిలిపివేయాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని కొందరు ముస్లిం వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. సదరు స్కూల్ యాజమాన్యం సైతం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తులు స్కూల్ ఉపాధ్యాయులను బెదిరించడంతో పాటు, స్కూల్లో ప్రేయర్స్‌ని ఆపేందుకు యత్నించారని ఉపాధ్యాయులు తమ ఫిర్యాదు పేర్కొన్నారు.

జనవరి 23 న జరిగిన ఈ సంఘటన ధోండివాలి పాలంపూర్‌లోని ఎన్ కొఠారి ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాఠశాలకు కొందరు సంఘవిద్రోహులు వచ్చి బీభత్సం సృష్టించారని, ప్రార్థనలు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారని డివిజన్‌ ​​ప్రాథమిక విద్యాధికారికి ఇచ్చిన ఫిర్యాదులో ఉపాధ్యాయుడు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రార్థనలు ప్రారంభం కాగానే 10 నుంచి 12 మందితో కూడిన గుంపు పాఠశాలలోకి దూసుకెళ్లింది. తక్షణమే ప్రార్థనలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో 16 మంది ఉపాధ్యాయులు, 500 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 150 మంది ముస్లిం వర్గానికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు.

పాఠశాల మ్యూజిక్ టీచర్ మాట్లాడుతూ.. స్కూల్ ప్రేయర్ టైమ్‌లో ప్రతిరోజూ విద్యార్థులు మంత్రాలు, ప్రార్థనలు చేస్తారు. ఇతర కార్యకలాపాలలో క్విజ్ మొదలైనవి ఉంటాయి. అయితే, ప్రార్థన చేస్తున్న సమయంలో ఓ గుంపు లోపలికి ప్రవేశించింది. ప్రేయర్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. వారి చర్యతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ డివిజన్‌ ​ప్రాథమిక విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162