Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలి ప్రేమకోసం ఘరానా దొంగగా మారిన ప్రియుడు.. ఖరీదైన బైకులే టార్గెట్‌గా..

సోమవారం అతడిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు చెప్పిన నిజం తెలిసి ఖాకీలే కంగుతిన్నారు. కేవలం తన ప్రేయసిని

ప్రియురాలి ప్రేమకోసం ఘరానా దొంగగా మారిన ప్రియుడు.. ఖరీదైన బైకులే టార్గెట్‌గా..
Stole Expensive Bikes
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 27, 2023 | 8:59 AM

ప్రియురాలి ముందు బిల్డప్‌ కోసం ఓ యువకుడు పెద్ద రిస్కే చేశాడు. గర్ల్‌ఫ్రెండ్‌ కోసం ఆ యువకుడు దొంగగా మారాడు. ఈ విచిత్ర సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో వెలుగు చూసింది. థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలో ఖరీదైన మోటార్‌సైకిళ్లను దొంగిలించిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారి వెల్లడించారు.

నిందితుడు, శుభం భాస్కర్ పవార్ అనే యువకుడు.. తన ప్రియురాలిని ఇంప్రెస్‌ చేసేందుకు గానూ,..ఖరీదైన మోటార్‌బైక్‌లను దొంగిలించాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ III-కళ్యాణ్) సచిన్ గుంజాల్ బుధవారం మీడియాకు వెల్లడించారు. సోమవారం అతడిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు చెప్పిన నిజం తెలిసి ఖాకీలే కంగుతిన్నారు. కేవలం తన ప్రేయసిని సంతోష పెట్టేందుకే ఈ చోరీలకు పాల్పడినట్లు చెప్పాడు.

తాను మొత్తం 13 బైక్‌లు దొంగిలించినట్లు శుభం విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో లాతూర్, షోలాపూర్, పూణెతో సహా పలు ప్రాంతాల నుంచి రూ. 16.05 లక్షల విలువైన 13 చోరీ చేసిన మోటర్‌బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..