Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guwahati: ప్రియుడి ఫ్లాట్‌లో యువతి అనుమానాస్పద మృతి! పోలీసుల అదుపులో ప్రియుడు

అస్సాంలోని గౌహతిలోని ఓ ఫ్లాట్‌లో యువతి మృతి చెందినట్లు హతిగావ్ పోలీసులు గురువారం (నవంబర్‌ 30) గుర్తించారు. గౌహతిలోని హతిగావ్ ప్రాంతంలోని రాజ్‌పాత్‌లోని కాసా లిమిటాడో అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద రీతిలో మహిళ మృతి చెందింది. మృతురాలిని మేఘాలయకు చెందిన రితికా సోనార్‌గా గుర్తించారు. మృతురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన రూపేష్ రాయ్ అనే యువకుడితో చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు అపార్ట్‌మెంట్‌లోని..

Guwahati: ప్రియుడి ఫ్లాట్‌లో యువతి అనుమానాస్పద మృతి! పోలీసుల అదుపులో ప్రియుడు
Guwahati Murder Case
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 01, 2023 | 11:55 AM

గౌహతి, డిసెంబర్‌ 1: అస్సాంలోని గౌహతిలోని ఓ ఫ్లాట్‌లో యువతి మృతి చెందినట్లు హతిగావ్ పోలీసులు గురువారం (నవంబర్‌ 30) గుర్తించారు. గౌహతిలోని హతిగావ్ ప్రాంతంలోని రాజ్‌పాత్‌లోని కాసా లిమిటాడో అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద రీతిలో మహిళ మృతి చెందింది. మృతురాలిని మేఘాలయకు చెందిన రితికా సోనార్‌గా గుర్తించారు. మృతురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన రూపేష్ రాయ్ అనే యువకుడితో చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో నివసిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

బుధవారం రాత్రి ఈ జంట గొడవపడ్డారు. ఆ తర్వాత రితికా సోనార్ తన గది తలుపులు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకూ ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో రూపేష్ గది తలుపులు పగులగొట్టాడు. అనంతరం గదిలోకి ప్రవేశించి చూడగా రితికా సోనార్ అపస్మారక స్థితిలో కనిపించింది. అనంతరం గౌహతి మెడికల్ కాలేజీకి హుటాహుటీన తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న హతిగావ్ పోలీసులు గురువారం తెల్లవారుజామున సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రియుడు రూపేష్ రాయ్‌ను విచారణ నిమిత్తం హతిగావ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నవంబర్‌ నెలలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. మొదటి సంఘటన సిక్స్ మైల్ వద్ద జరిగింది. ఇక్కడ చోంగజాన్‌కు చెందిన అంజు దోర్జీ అనే మహిళ చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రెండవ సంఘటనలో ధేమాజీకి చెందిన యువతి అనుష్క సైకియా. నగరంలో యువతుల మృతి కేసులు వరుసగా నమోదవుతుండటంలో పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.