Facebook Friend: ఫేస్‌బుక్‌ ప్రియుడ్ని పెళ్లాడేందుకు పాక్‌కు వెళ్లిన అంజూ.. పిల్లలు గుర్తొస్తున్నారంటూ భారత్‌కు తిరిగొచ్చిన వైనం

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లి, అక్కడే రెండోపెళ్లి చేసుకున్న రాజస్థాన్‌ యువతి తిరిగి భారత్‌కు వచ్చింది. అట్టారి వాఘా బోర్డర్‌ నుంచి ఆమె భారత్‌లోకి బుధవారం స్వదేశంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ (34) పాక్‌కు చెందిన నస్రుల్లా (29) అనే యువకుడితో 2019లో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నస్రుల్లాను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన ఆమె, అనూహ్యంగా అతణ్ని పెళ్లి చేసుకుంది. నస్రుల్లా బుధవారం (నవంబర్‌ 29) సరిహద్దుదాకా ఆమె

Facebook Friend: ఫేస్‌బుక్‌ ప్రియుడ్ని పెళ్లాడేందుకు పాక్‌కు వెళ్లిన అంజూ.. పిల్లలు గుర్తొస్తున్నారంటూ భారత్‌కు తిరిగొచ్చిన వైనం
Facebook Love Story
Follow us

|

Updated on: Nov 30, 2023 | 7:12 AM

న్యూఢిల్లీ, నవంబర్‌ 30: ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లి, అక్కడే రెండోపెళ్లి చేసుకున్న రాజస్థాన్‌ యువతి తిరిగి భారత్‌కు వచ్చింది. అట్టారి వాఘా బోర్డర్‌ నుంచి ఆమె భారత్‌లోకి బుధవారం స్వదేశంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ (34) పాక్‌కు చెందిన నస్రుల్లా (29) అనే యువకుడితో 2019లో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నస్రుల్లాను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన ఆమె, అనూహ్యంగా అతణ్ని పెళ్లి చేసుకుంది. నస్రుల్లా బుధవారం (నవంబర్‌ 29) సరిహద్దుదాకా ఆమె వెంట వచ్చి భారత్‌లోకి సాగనంపాడు.

రాజస్థాన్‌లోని భీవాడీకి చెందిన అంజూకు అప్పటికే వివాహమై 15 ఏళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. 2019లో ఆమె నస్రుల్లా అనే పాకిస్థాన్‌ యువకుడిని ఫేస్‌బుక్‌ ద్వారా కలిసింది. అనంతరం వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది జూన్‌లో తన కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమె నస్రూన్‌ను కలిసేందుకు పాక్‌కి వెళ్లింది. అయితే తన భర్తకు మాత్రం జైపూర్‌ వెళ్తున్నట్లు చెప్పింది. తీరా చూస్తే ఆమె పాక్‌లో ప్రత్యక్షమైంది. పాక్‌లో అంజూ తన ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకునేందుకు ఇస్లాం మతాన్ని స్వీకరించింది. పాక్‌లో అతన్ని పెళ్లి చేసుకున్నాక ఆమె పేరును ఫాతిమాగా మార్చుకుంది. ఆమె నిర్వాకంతో భారత్‌లోని కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈ నేపథ్యంలో నస్రుల్లా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. అంజూ తిరిగి భారత్‌కు వస్తుందని చెప్పాడు. ఆమె మానసిక వేదనతో బాధపడుతోందని, తన ఇద్దరు పిల్లలపై బెంగ పెట్టుకున్నట్లు అతడు వెల్లడించాడు. ఆమె పిల్లలను కలిసేందుకు భారత్‌లోని ఇంటికి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంజూ వెంటన తాను కూడా భారత్‌కు వచ్చేందుకు సిద్ధపడ్డానన్నాడు. అయితే వీసా విషయంలో ఇబ్బంది కారణంగా రాలేకపోయినట్లు తెలిపాడు. అంజూ మొదటి భర్తా అరవింద్‌ భివాడి ఆమెపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుందని అంజూపై ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రస్తుతం అరవింద్‌ తన పిల్లలతో ఎక్కడ నివసిస్తున్నాడనేది స్పష్టంగా తెలియరాలేదు.

అయినప్పటికీ భారత్‌కు ఎందుకు తిరిగి వచ్చావని వాఘా వద్ద మీడియా అడిగిన ప్రశ్నకు అంజూ సమాధానం ఇస్తూ ‘నేను సంతోషంగా ఉన్నాను. చెప్పడానికి ఏమీ లేదు. నా కుటుంబాన్ని కలిసేందుకు ఇష్టప్రకారమే భారత్‌కు వచ్చాను’ అంటూ ముఖానికి మాస్క్‌ ధరించి వేగంగా వెళ్లిపోయింది. కాగా ఇప్పటి వరకూ ఆమె రాజస్థాన్‌లోని తన ఇంటికి చేరుకోలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?