Maharashtra Political Crisis: బల పరీక్ష నేడే.. క్లైమాక్స్‌కు చేరిన మహా రాజకీయం.. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..!

శివసేన నేత ఏక్‌నాథ్‌ శిండే వర్గీయులు తిరుగుబాటుతో అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో మహా వికాస్‌ అఘాడీ సర్కార్‌ కూలిపోయింది. కాగా.. కొత్త సీఎంగా బీజేపీ నేత ఫడ్నవీస్‌ ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది.

Maharashtra Political Crisis: బల పరీక్ష నేడే.. క్లైమాక్స్‌కు చేరిన మహా రాజకీయం.. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..!
Maharashtra Political Crisi
Follow us

|

Updated on: Jun 30, 2022 | 7:32 AM

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం (Maharashtra) చివరి దశకు చేరుకుంది. ఈ రోజు జరిగే బలపరీక్షకు ముందే ఉద్ధవ్‌ థాక్రే సీఎం పదవికి ఉద్ధవ్‌ రాజీనామాతో మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తిరిగింది. శివసేన నేత ఏక్‌నాథ్‌ శిండే వర్గీయులు తిరుగుబాటుతో అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో మహా వికాస్‌ అఘాడీ సర్కార్‌ కూలిపోయింది. కాగా.. కొత్త సీఎంగా బీజేపీ నేత ఫడ్నవీస్‌ ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. షిండే నేతృత్వంలోని రెబల్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. రెబెల్స్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో పడింది బీజేపీ. అంతా అనుకూలిస్తే.. మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ మూడోసారి మహారాష్ట్ర సీఎం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏక్‌నాథ్‌షిండే డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమకు161 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని ఫడ్నవీస్‌ (Devendra Fadnavis) పేర్కొన్నారు. నేడు జరిగే బల పరీక్ష అనంతరం మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.

అసెంబ్లీలో బలపరీక్ష గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే అవకాశం ఉంది. అయితే.. సీఎం రాజీనామా చేసిన నేపథ్యంలో బలపరీక్ష ఉండదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రే రాజీనామా చేసిన నేపథ్యంలో.. బలాన్ని నిరూపించుకుంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని సమాచారం. ఇదిలాఉంటే.. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉదయం ముంబైకి చేరుకుంటారని చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీతో జతకడతారని, జూలై 1న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండొచ్చని సమాచారం.

కాగా.. ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. రాత్రి 11.30 గంటలకు గవర్నర్ బంగ్లాకు చేరుకొని రాజీనామా పత్రాన్ని అందజేశారు. దానికి వెంటనే గవర్నర్ భగంత్ సింగ్ కోష్యారీ ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని గవర్నర్ ఉద్ధవ్ ను కోరారు.

ఇవి కూడా చదవండి

ఆసక్తికరంగా షిండే అడుగులు..

మరోవైపు.. తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఏక్‌నాథ్‌ షిండే అడుగులు ఆసక్తి రేపుతున్నాయి. 40 మందికి పైగా ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్న షిండే.. తర్వాతి ఆలోచనేంటన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. తమదే అసలైన శివసేన అని వాదిస్తున్నారు షిండే. బాలాసాహేబ్‌ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉద్దవ్‌ వ్యవహరించారని.. బాలాసాహేబ్‌ అసలైన వారసులం మేమే అని ప్రకటిస్తున్నారు. షిండే మాటల్ని బట్టి.. శివసేనను కబళించే ప్రయత్నం చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శివసేనను పూర్తిగా హస్తగతం చేసుకొనేందుకు షిండే న్యాయ పోరాటం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే మహారాష్ట్రలో శాంతిభద్రతల సమస్య తలెత్తే చాన్సుంది. శివసేనను ఎవరూ తాకలేరని ఉద్ధవ్‌ చెబుతున్నారు. ఉద్ధవ్‌ హెచ్చరికలు.. షిండే ప్రకటనలతో ముంబైలో హీట్‌ పెరుగుతోంది. ఉద్ధవ్‌ వర్సెస్‌ షిండే అన్నట్టుగా మహారాష్ట్ర రాజకీయాలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జాతీయ వార్తల కోసం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..